ETV Bharat / state

ఆధ్యాత్మిక నగరిలో ఉద్రిక్తత - గోశాలపై కుట్రలకు చెక్‌ పెట్టిన కూటమి నేతలు - NDA AND YCP CHALLENGES ON TIRUMALA

నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో తిరుమలలో ఉద్రిక్తత - గోశాలలో అక్రమాలు నిరూపిస్తానంటూ భూమన సవాల్‌ - గోశాల వద్దకు చేరుకున్న కూటమి నేతలు

NDA_and_YCP_challenges_on_Tirumala
NDA_and_YCP_challenges_on_Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 17, 2025 at 8:27 PM IST

2 Min Read

Tension in Tirumala over NDA and YSRCP challenges: గోశాల అంశంపై నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గోశాలలో అక్రమాలు నిరూపిస్తానంటూ వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు కూటమి నేతలు స్వాగతించారు. కూటమి నేతలు గోశాలకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసినా సవాల్‌ విసిరిన భూమన మాత్రం ముఖం చాటేశారు.

తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అసత్యప్రచారాలకు కూటమి నేతలు ముగింపు పలికారు. గోశాలలో అక్రమాలను స్వయంగా నిరూపిస్తానంటూ వైఎస్సార్సీపీ నేతలు సవాల్‌ విసరగా కూటమి నేతలు సై అన్నారు. ఉదయం 9 గంటలకే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి నేతలంతా గోశాల వద్దకు చేరుకున్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి కోసం గంటల తరబడి ఎదురు చూశారు. సవాలు, ప్రతిసవాళ్లతో గోశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఆధ్యాత్మిక నగరిలో ఉద్రిక్తత - గోశాలపై కుట్రలకు చెక్‌ పెట్టిన కూటమి నేతలు (ETV Bharat)

భూమనపై చట్టపరమైన చర్యలు- హోం మంత్రి అనిత

రోడ్డుపైనే బైఠాయించి నిరనస: ఇరుపక్షాలు ఒకేసారి గోశాల వద్దకు వస్తే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు కూటమి నేతలు వెళ్లాక రావాలని కరుణాకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భూమనను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరనస తెలిపారు. కూటమి నేతల సూచనలతో పోలీసులు కరుణాకర్‌ రెడ్డితో చర్చించి గోశాలకు వెళ్లాలని సూచించినా ఆయన వెనకడుగు వేశారు. కుమారుడు అభినయ్‌ రెడ్డితోపాటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని గోశాలకు పంపారు.

గత ఐదేళ్లలో గోశాలలో చోటుచేసుకున్న అక్రమాలపై టీటీడీ విజిలెన్స్‌ నివేదికలను ఎంపీ గురుమూర్తి ముందు ఉంచి వాటికి సమాధానం చెప్పాలంటూ కూటమి నేతలు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసిన ఎంపీ గురుమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికైనా గోశాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కూటమి నేతలు హితవు పలికారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతలు సూచించారు.

తిరుమలపై వైఎస్సార్సీపీ నేత భూమన అసత్య ప్రచారం - చర్యలకు సిద్ధమైన టీటీడీ

టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు - గోవు, గోవిందుడితో భూమన ఆటలా?

Tension in Tirumala over NDA and YSRCP challenges: గోశాల అంశంపై నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గోశాలలో అక్రమాలు నిరూపిస్తానంటూ వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు కూటమి నేతలు స్వాగతించారు. కూటమి నేతలు గోశాలకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసినా సవాల్‌ విసిరిన భూమన మాత్రం ముఖం చాటేశారు.

తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అసత్యప్రచారాలకు కూటమి నేతలు ముగింపు పలికారు. గోశాలలో అక్రమాలను స్వయంగా నిరూపిస్తానంటూ వైఎస్సార్సీపీ నేతలు సవాల్‌ విసరగా కూటమి నేతలు సై అన్నారు. ఉదయం 9 గంటలకే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి నేతలంతా గోశాల వద్దకు చేరుకున్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి కోసం గంటల తరబడి ఎదురు చూశారు. సవాలు, ప్రతిసవాళ్లతో గోశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఆధ్యాత్మిక నగరిలో ఉద్రిక్తత - గోశాలపై కుట్రలకు చెక్‌ పెట్టిన కూటమి నేతలు (ETV Bharat)

భూమనపై చట్టపరమైన చర్యలు- హోం మంత్రి అనిత

రోడ్డుపైనే బైఠాయించి నిరనస: ఇరుపక్షాలు ఒకేసారి గోశాల వద్దకు వస్తే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు కూటమి నేతలు వెళ్లాక రావాలని కరుణాకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భూమనను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరనస తెలిపారు. కూటమి నేతల సూచనలతో పోలీసులు కరుణాకర్‌ రెడ్డితో చర్చించి గోశాలకు వెళ్లాలని సూచించినా ఆయన వెనకడుగు వేశారు. కుమారుడు అభినయ్‌ రెడ్డితోపాటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని గోశాలకు పంపారు.

గత ఐదేళ్లలో గోశాలలో చోటుచేసుకున్న అక్రమాలపై టీటీడీ విజిలెన్స్‌ నివేదికలను ఎంపీ గురుమూర్తి ముందు ఉంచి వాటికి సమాధానం చెప్పాలంటూ కూటమి నేతలు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసిన ఎంపీ గురుమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికైనా గోశాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కూటమి నేతలు హితవు పలికారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతలు సూచించారు.

తిరుమలపై వైఎస్సార్సీపీ నేత భూమన అసత్య ప్రచారం - చర్యలకు సిద్ధమైన టీటీడీ

టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు - గోవు, గోవిందుడితో భూమన ఆటలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.