ETV Bharat / state

JEE ఫలితాల్లో మనోళ్లు అదరగొట్టారు - నంబర్​ 1​ ర్యాంకును పట్టేశారు - JEE MAIN 2025 RESULT

జేఈఈ మెయిన్ సెషన్ -2 ఫలితాలు విడుదల - దేశవ్యాప్తంగా మొత్తం 24 మందికి వంద పర్సంటైల్ - హైదరాబాద్​ నుంచి అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీకి 100 పర్సంటైల్

JEE Main Session 2 Result
JEE Main Session 2 Result (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 19, 2025 at 7:35 AM IST

2 Min Read

JEE Main Session 2 Result : జేఈఈ మెయిన్​ సెషన్​-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. హైదరాబాద్​కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ ​రెడ్డి 300కి 300 మార్కులు పొందటంతో ఇద్దరికీ ఎన్​టీఏ ఒకే ర్యాంకును కేటాయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఒకటో ర్యాంకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్​ విభాగంలో కూడా అజయ్​రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్​రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తాటిపాడు. అతడు 9వ తరగతి నుంచి హైదరాబాద్​లోనే చదువుతున్నారు.

ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి ఒకటే ర్యాంకు కేటాయించారు. ఎన్​టీఏ శుక్రవారం అర్ధరాత్రి జేఈఈ మెయిన్​ ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుది కీని విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ, 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రే ఫలితాలను వెల్లడించింది. ఈసారి జనరల్​ విభాగంలో కటాఫ్​ ర్యాంకుకు 93.102 పర్సంటైల్​గా నిర్ణయించారు. ఇది గతేడాది 93.236గా ఉంది.

ఈసారి పరీక్షకు 14.75 లక్షల మంది : ఈసారి జేఈఈ పరీక్షను మొత్తం 14.75 లక్షల మంది రాశారు. ఇందులో కటాఫ్​ మార్కులు జనరల్​ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్​ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90 పర్సంటైల్​ స్కోర్​ను కటాఫ్​గా నిర్ణయించారు. ఈ స్కోరుకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్​ పొందిన వారు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించనున్నారు. రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 24 మంది 100 పర్సంటైల్​ స్కోర్​ సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్​ ఎ.గుప్తా, అజయ్​ రెడ్డి ఉండగా, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు.

JEE Main Session 2 Result : జేఈఈ మెయిన్​ సెషన్​-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. హైదరాబాద్​కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ ​రెడ్డి 300కి 300 మార్కులు పొందటంతో ఇద్దరికీ ఎన్​టీఏ ఒకే ర్యాంకును కేటాయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఒకటో ర్యాంకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్​ విభాగంలో కూడా అజయ్​రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్​రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తాటిపాడు. అతడు 9వ తరగతి నుంచి హైదరాబాద్​లోనే చదువుతున్నారు.

ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి ఒకటే ర్యాంకు కేటాయించారు. ఎన్​టీఏ శుక్రవారం అర్ధరాత్రి జేఈఈ మెయిన్​ ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుది కీని విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ, 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రే ఫలితాలను వెల్లడించింది. ఈసారి జనరల్​ విభాగంలో కటాఫ్​ ర్యాంకుకు 93.102 పర్సంటైల్​గా నిర్ణయించారు. ఇది గతేడాది 93.236గా ఉంది.

ఈసారి పరీక్షకు 14.75 లక్షల మంది : ఈసారి జేఈఈ పరీక్షను మొత్తం 14.75 లక్షల మంది రాశారు. ఇందులో కటాఫ్​ మార్కులు జనరల్​ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్​ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90 పర్సంటైల్​ స్కోర్​ను కటాఫ్​గా నిర్ణయించారు. ఈ స్కోరుకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్​ పొందిన వారు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించనున్నారు. రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 24 మంది 100 పర్సంటైల్​ స్కోర్​ సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్​ ఎ.గుప్తా, అజయ్​ రెడ్డి ఉండగా, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు.

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - ఇలా ఈజీగా చెక్ చేసుకోండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై యూటర్న్‌ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.