ETV Bharat / state

ALERT : నేడు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల - ఎన్నిగంటల కంటే? - TELANGANA SSC RESULTS 2025

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు పదో తరగతి ఫలితాలు విడుదల - ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి - ఫలితాలను https://bse.telangana.gov.in, results.eenadu.net లో ఒక్క క్లిక్‌తోనే చూసుకోవచ్చు

Telangana Tenth Results 2025 to be Released By CM Revanth Reddy
Telangana Tenth Results 2025 to be Released By CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 29, 2025 at 5:07 PM IST

Updated : April 30, 2025 at 6:52 AM IST

2 Min Read

Telangana Tenth Results 2025 to be Released Today : లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి పరీక్షల ఫలితాల నేడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగ్గా దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in, results.eenadu.netలో ఒక్క క్లిక్‌తోనే పొందొచ్చు.

ఇకపై మార్కుల మెమోలు ఇలా : పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా దాదాపు 20 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్‌తో పాటుగా క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ) ఇచ్చేవారు.

పాస్, ఫెయిల్ : ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు.

సీబీఎస్‌ఈ తరహాలోనే : వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. సీబీఎస్‌ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. ఇక్కడా అదేవిధంగా ఉంటుందా? అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Telangana Tenth Results 2025 to be Released Today : లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి పరీక్షల ఫలితాల నేడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగ్గా దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in, results.eenadu.netలో ఒక్క క్లిక్‌తోనే పొందొచ్చు.

ఇకపై మార్కుల మెమోలు ఇలా : పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా దాదాపు 20 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్‌తో పాటుగా క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ) ఇచ్చేవారు.

పాస్, ఫెయిల్ : ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు.

సీబీఎస్‌ఈ తరహాలోనే : వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. సీబీఎస్‌ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. ఇక్కడా అదేవిధంగా ఉంటుందా? అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

టెన్త్​ తర్వాత ఏం చేయాలా అనే కన్​ఫ్యూజన్​లో ఉన్నారా? - ఇది చూస్తే ఫుల్ క్లారిటీ!

పది తర్వాత ఎన్నో అవకాశాలు - కరెక్ట్ స్టెప్ వేస్తే కెరీర్ సెట్!

టెన్త్ తర్వాత జాబ్​ కావాలా? - ఈ షార్ట్ టర్మ్​​ కోర్సులు నేర్చుకుంటే సూపర్​ బెనిఫిట్స్​!

Last Updated : April 30, 2025 at 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.