ETV Bharat / state

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వండి - ఆదేశించిన హెచ్​ఆర్​సీ కమిషన్ - TG HUMAN RIGHTS COMMISSION

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన రాష్ట్రమానవ హక్కుల కమిషన్ - ఘటనపై సుమోటోగా కేసు విచారణకు ఆదేశించిన కమిషన్‌ ఛైర్మన్ - జూన్ 30 లోగా నివేదిక సమర్పించాలని సీఎస్‌కు ఆదేశాలు

HUMAN RIGHTS COMMISSION
HUMAN RIGHTS COMMISSION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2025 at 10:45 PM IST

1 Min Read

Human Rights Commission on Gulzar House Fire Incident : హైదరాబాద్​లోని పాతబస్తీ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ హ్యుమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్​ఆర్​సీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ షమీమ్ అక్తర్ కేసును విచారణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భవన భద్రత, విద్యుత్‌ నిర్వహణపై ప్రముఖ వార్తా పత్రికలు, మీడియాలో కథనాలు రావడంతో కమిషన్‌ స్పందించింది.

రిపోర్ట్​ సమర్పించండి : అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది(8 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు) మృతి చెందడంపై జూన్ 30వ తేదీ లోగా రిపోర్ట్​ సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోపాటు అగ్నిమాపక డెరెక్టర్ జనరల్, టీజీఎస్పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్లు, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్​లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్‌ పరిధిలో ఆదివారం(మే 18న) గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే.

మొదటి అంతస్తులో మంటలు : మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని ఫైర్ సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి ట్రీట్​మెంట్ అందించారు.

Human Rights Commission on Gulzar House Fire Incident : హైదరాబాద్​లోని పాతబస్తీ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ హ్యుమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్​ఆర్​సీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ షమీమ్ అక్తర్ కేసును విచారణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భవన భద్రత, విద్యుత్‌ నిర్వహణపై ప్రముఖ వార్తా పత్రికలు, మీడియాలో కథనాలు రావడంతో కమిషన్‌ స్పందించింది.

రిపోర్ట్​ సమర్పించండి : అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది(8 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు) మృతి చెందడంపై జూన్ 30వ తేదీ లోగా రిపోర్ట్​ సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోపాటు అగ్నిమాపక డెరెక్టర్ జనరల్, టీజీఎస్పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్లు, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్​లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్‌ పరిధిలో ఆదివారం(మే 18న) గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే.

మొదటి అంతస్తులో మంటలు : మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని ఫైర్ సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి ట్రీట్​మెంట్ అందించారు.

సంధ్య థియేటర్​ ఘటన - ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు

'మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ?' - లగచర్ల ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.