ETV Bharat / state

పాతబస్తీలో మెట్రో నిర్మాణం - చారిత్రక కట్టడాలకు నష్టం చేయకూడదు : హైకోర్టు - HC ON METRO WORKS IN OLD CITY

పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం - చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదన్న హైకోర్టు - తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా

High Court On Hyderabad Metro Works in Old City
High Court On Hyderabad Metro Works in Old City (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 3:56 PM IST

2 Min Read

High Court On Hyderabad Metro Works in Old City : హైదరాబాద్​ లోని పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది. యాక్ట్‌ ఫర్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మహ్మద్ రహీం ఖాన్ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండేషన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు వివరించారు. చారిత్రక కట్టడాలను కూలగొట్టడం లేదని అన్నారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని తెలిపారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి ఏఏజీ టైం కోరారు.

తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా : ధర్మాసనం స్పందిస్తూ మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచనలు చేసింది. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ నెల 22 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే? : మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్ నుంచి చంద్రాయణ్‌గుట్ట వరకు చేపడుతున్న మెట్రో రైలు నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలకు ముప్పు ఏర్పడుతుందని మహ్మద్ రహీం ఖాన్ పేర్కొన్నారు. మెట్రో మార్గానికి సమీపంలో చార్మినర్‌, ఫలక్‌నూమా ప్యాలెస్‌తో పాటు పురానా హవేలీ, మొఘల్‌పుర సమాధుల వంటి చారిత్రక కట్టడాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ హరిటేజ్ చట్టం 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మెట్రో రైలు నిర్మాణ పనులను ఆపేలా ఆదేశాలివ్వాలని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోరారు.

మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదిక సమర్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు లేదా నిపుణుల కమిటీ ఆమోదం తర్వాత మెట్రో రైలు పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని మహ్మద్ రహీం తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్‌బోర్డు సీఈఓను ప్రతివాదులుగా చేర్చారు.

హైదరాబాద్​ పాతబస్తీకి మెట్రో విస్తరణ - హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

High Court On Hyderabad Metro Works in Old City : హైదరాబాద్​ లోని పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది. యాక్ట్‌ ఫర్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మహ్మద్ రహీం ఖాన్ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండేషన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు వివరించారు. చారిత్రక కట్టడాలను కూలగొట్టడం లేదని అన్నారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని తెలిపారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి ఏఏజీ టైం కోరారు.

తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా : ధర్మాసనం స్పందిస్తూ మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచనలు చేసింది. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ నెల 22 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే? : మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్ నుంచి చంద్రాయణ్‌గుట్ట వరకు చేపడుతున్న మెట్రో రైలు నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలకు ముప్పు ఏర్పడుతుందని మహ్మద్ రహీం ఖాన్ పేర్కొన్నారు. మెట్రో మార్గానికి సమీపంలో చార్మినర్‌, ఫలక్‌నూమా ప్యాలెస్‌తో పాటు పురానా హవేలీ, మొఘల్‌పుర సమాధుల వంటి చారిత్రక కట్టడాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ హరిటేజ్ చట్టం 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మెట్రో రైలు నిర్మాణ పనులను ఆపేలా ఆదేశాలివ్వాలని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోరారు.

మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదిక సమర్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు లేదా నిపుణుల కమిటీ ఆమోదం తర్వాత మెట్రో రైలు పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని మహ్మద్ రహీం తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్‌బోర్డు సీఈఓను ప్రతివాదులుగా చేర్చారు.

హైదరాబాద్​ పాతబస్తీకి మెట్రో విస్తరణ - హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.