Telangana Government Planning to Issue New Pensions : నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పింఛను లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే, ఆయన భార్యకు వితంతు పింఛనుకు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నా, మంజూరు చేయడం లేదు.
ఇటీవల పింఛన్లపై పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది. పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్కలెక్టర్ల ద్వారా దరఖాస్తు పరిశీలనలు చేయించాలని పేర్కొంది.
ఇవీ సూచనలు :
- వృద్ధాప్య పింఛను పొందుతూ లబ్ధిదారులు మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలను జరిపి, వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలి. అందుకు పెన్షనర్ ఐడీ, మరణ ధ్రువీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించాలి.
- వరుసగా మూడు నెలలు పింఛను తీసుకోనివారిని వలస వెళ్లినట్లుగా గుర్తించి వారి పింఛన్ను రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పింఛనుకు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి.
- ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్ పథకం కింద 42.96 లక్షల మంది లబ్ధి చేకూరుతుంది. అందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధి బాధితులున్నారు. సాధారణ పింఛను నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తున్నారు.
కనిపెంచిన అమ్మకే అమ్మయిన చిన్నారి - పదేళ్ల చిట్టితల్లి కన్నీటి గాథ
ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - ఆ గుర్తింపుతో ఈజీగా డబ్బులు