ETV Bharat / state

సైబర్​ మోసాలకు ఖాతాల సాయం​ - బ్యాంక్​ మేనేజర్​ సహా 20 మంది అరెస్ట్ - TELANGANA CYBER SECURITY BUREAU

సైబర్​ మోసాలకు ఖాతాల సాయం - గుజరాత్​లో సైబర్​ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్​ ఆపరేషన్​ - బ్యాంక్​ మేనేజర్​ సహా 20 మంది అరెస్టు

Telangana Cyber Security Bureau
Telangana Cyber Security Bureau (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2025 at 9:27 AM IST

2 Min Read

Telangana Cyber Security Bureau Busts Cybercrimes Network in Gujarat : గుజరాత్​ కేంద్రంగా సైబర్​ నేరాలకు సహకరిస్తున్న ఘరానా ముఠా ఆటను టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కట్టించింది. గుజరాత్​లో 10 రోజులు స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టి బ్యాంక్​ మేనేజర్​ సహా 20 మందిని అరెస్టు చేసినట్లు సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​ శిఖా గోయల్​ సోమవారం తెలిపారు. వారి ప్రమేయం దేశవ్యాప్తంగా 515, తెలంగాణలో 60 కేసుల్లో ఉన్నట్లు తేల్చినట్లు చెప్పారు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ సైబర్​క్రైమ్​ పోలీస్​ స్టేషన్​లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను ఛేదించేందుకు డీఎస్పీలు కె.వి. సూర్యప్రకాశ్​, ఫణీందర్​, రంగారెడ్డి, సూర్యదేవర హరికృష్ణ, ఇన్​స్పెక్టర్ల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ట్రేడింగ్​, పెట్టుబడులు, పార్ట్​టైమ్​ ఉద్యోగాల పేరిట రూ.4.37 కోట్లు కాజేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయని తెలిపారు. ఐదుగురు నిందితులు చెక్​లతో రూ.22,64,500 డబ్బును విత్​డ్రా చేశారని వారు గుర్తించారు. వారు గుజరాత్​ అడ్డాగా ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఎస్పీ దేవేందర్​ సింగ్​ పర్యవేక్షణలో ఈ నెల 1న 10 మంది సైబర్​ సెక్యూరిటీ బ్యూరో నిందితుల వేట ప్రారంభించారు. 10 రోజుల పాటు గుజరాత్​లోని పలు ప్రాంతాల్లో వారంతా మకాం వేశారు. నిందితులు, కొందరు వ్యాపారులు, ఉద్యోగులకు కమీషన్​ ఆశచూపి బ్యాంకు ఖాతాలు సేకరించినట్లు గుర్తించారు. అయితే గుజరాత్​లోని కొంతమంది బ్యాంకు సిబ్బంది మ్యూల్​ ఖాతాలు తెరిచి మోసగాళ్లకు సహకరించినట్లు గుర్తించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ : వారందరినీ పట్టుకునేందుకు బంజారాహిల్స్​ పోలీస్​ కమాండ్​ కంట్రోల్​లోని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీని గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలోని పోలీసు బృందంతో సమన్వయం చేసుకుంది. డీసీబీ బ్యాంక్​ రిలేషన్​షిప్​ మేనేజర్​ అంకిత్​కుమార్​ సింగ్ (26) సహా ఏజెంట్లు, మ్యూల్​ ఖాతాదారులు ఇలా 20 మందిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. వారిని రిమాండ్​కు తరలించారు. టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన మేజర్​ ఆపరేషన్లలో ఇది ఐదోదని శిఖా గోయల్​ వెల్లడించారు. ఈ ఆపరేషన్​లో పాల్గొన్న వారందరినీ అభినందించారు.

సైబర్​ నేరాలపై ఫిర్యాదు ఇకపై మరింత సులభంగా - చాట్​బాట్​తో చకచకా చేసేయొచ్చు!

సైబర్​ నేరగాళ్ల బారినపడితే పీఎస్​లో ఫిర్యాదు​ చేయండి - లేదంటే డబ్బులు తిరిగి పొందలేరు!

Telangana Cyber Security Bureau Busts Cybercrimes Network in Gujarat : గుజరాత్​ కేంద్రంగా సైబర్​ నేరాలకు సహకరిస్తున్న ఘరానా ముఠా ఆటను టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కట్టించింది. గుజరాత్​లో 10 రోజులు స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టి బ్యాంక్​ మేనేజర్​ సహా 20 మందిని అరెస్టు చేసినట్లు సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​ శిఖా గోయల్​ సోమవారం తెలిపారు. వారి ప్రమేయం దేశవ్యాప్తంగా 515, తెలంగాణలో 60 కేసుల్లో ఉన్నట్లు తేల్చినట్లు చెప్పారు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ సైబర్​క్రైమ్​ పోలీస్​ స్టేషన్​లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను ఛేదించేందుకు డీఎస్పీలు కె.వి. సూర్యప్రకాశ్​, ఫణీందర్​, రంగారెడ్డి, సూర్యదేవర హరికృష్ణ, ఇన్​స్పెక్టర్ల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ట్రేడింగ్​, పెట్టుబడులు, పార్ట్​టైమ్​ ఉద్యోగాల పేరిట రూ.4.37 కోట్లు కాజేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయని తెలిపారు. ఐదుగురు నిందితులు చెక్​లతో రూ.22,64,500 డబ్బును విత్​డ్రా చేశారని వారు గుర్తించారు. వారు గుజరాత్​ అడ్డాగా ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఎస్పీ దేవేందర్​ సింగ్​ పర్యవేక్షణలో ఈ నెల 1న 10 మంది సైబర్​ సెక్యూరిటీ బ్యూరో నిందితుల వేట ప్రారంభించారు. 10 రోజుల పాటు గుజరాత్​లోని పలు ప్రాంతాల్లో వారంతా మకాం వేశారు. నిందితులు, కొందరు వ్యాపారులు, ఉద్యోగులకు కమీషన్​ ఆశచూపి బ్యాంకు ఖాతాలు సేకరించినట్లు గుర్తించారు. అయితే గుజరాత్​లోని కొంతమంది బ్యాంకు సిబ్బంది మ్యూల్​ ఖాతాలు తెరిచి మోసగాళ్లకు సహకరించినట్లు గుర్తించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ : వారందరినీ పట్టుకునేందుకు బంజారాహిల్స్​ పోలీస్​ కమాండ్​ కంట్రోల్​లోని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీని గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలోని పోలీసు బృందంతో సమన్వయం చేసుకుంది. డీసీబీ బ్యాంక్​ రిలేషన్​షిప్​ మేనేజర్​ అంకిత్​కుమార్​ సింగ్ (26) సహా ఏజెంట్లు, మ్యూల్​ ఖాతాదారులు ఇలా 20 మందిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. వారిని రిమాండ్​కు తరలించారు. టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన మేజర్​ ఆపరేషన్లలో ఇది ఐదోదని శిఖా గోయల్​ వెల్లడించారు. ఈ ఆపరేషన్​లో పాల్గొన్న వారందరినీ అభినందించారు.

సైబర్​ నేరాలపై ఫిర్యాదు ఇకపై మరింత సులభంగా - చాట్​బాట్​తో చకచకా చేసేయొచ్చు!

సైబర్​ నేరగాళ్ల బారినపడితే పీఎస్​లో ఫిర్యాదు​ చేయండి - లేదంటే డబ్బులు తిరిగి పొందలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.