Civil supply Corporation Got ISO Certificate : రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు సేవలు అందించడంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ తీసుకున్న నిర్ణయాలను గుర్తించిన హెచ్వైఎం అంతర్జాతీయ సంస్థ పౌర సరఫరాల శాఖను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించి ఐఎస్ఓ సర్టిఫికేట్ను అందజేసింది.
పౌరసరఫరాల సంస్థకు ఐఎస్ఓ సర్టిఫికెట్ : దేశంలో ముందెన్నడూ లేని రీతిలో విప్లవాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందజేయడంతో పాటు సంస్థ తీసుకొచ్చిన పలు విప్లవాత్మక సంస్కరణలను అధ్యయనం చేసిన ఈ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటించడంలో గుర్తించి ఐదు నక్షత్రాల రేటింగ్ కూడిన ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అందజేసింది.
ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఈ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో దేశంలోనే రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఈ అరుదైన సర్టిఫికెట్ను సొంతం చేసుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ విధంగా పౌర సరఫరాల కార్పొరేషన్ను తీర్చిదిద్దిన చౌహాన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఇది పౌర సరఫరాల శాఖా సిబ్బంది సమిష్టి కృషికి వచ్చిన గుర్తింపు అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఓ మైలురాయిగా నిలిచిపోతుంది : ఐఎస్ఓ (9001:2015) ధ్రువీకరణ పత్రంతోపాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు ఐదు నక్షత్రాల రేటింగ్ సాధించడం శాఖ పనితీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబింపచేస్తుందని డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుతమైన సేవలు అందిస్తున్న పౌర సరఫరాల సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఓ మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ నిబద్ధతతో అమలు చేస్తున్న విధానాలే ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు.
9 ఏళ్ల నిరీక్షణకు తెర - రేషన్ కార్డుల్లోకి కుటుంబ సభ్యుల పేర్లు
అలా చేస్తే పీడీయాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తాం! - రేషన్ డీలర్లకు మంత్రి కొండా సురేఖ హెచ్చరిక