ETV Bharat / state

పీకపై కత్తిపెట్టినా సరే ‘జై తెలుగుదేశం’ నినాదమే: నారా చంద్రబాబు - TDP 43RD FORMATION DAY

పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ - తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని వ్యాఖ్య

TDP 43RD FORMATION DAY
TDP 43RD FORMATION DAY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 29, 2025 at 10:02 AM IST

3 Min Read

TDP 43RD FORMATION DAY: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ నేతలు, శ్రేణులు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమని అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమని కొనియాడారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా అని అన్నారు. తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన, తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిందన్నారు. ఆడపడుచులకు అండగా నిలిచిందని, రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా అని సీఎం కొనియాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా అని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని చంద్రబాబు కొనియాడారు.

సభ్యత్వాలలో అసాధారణ రికార్డు: దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశమన్నారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి, తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ, చారిత్రాత్మక దినమైన నేటి రోజున ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేశారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని చంద్రబాబు నినదించారు.

ఆవిర్భావమే ఒక సంచలనం: తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రగతి - ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమన్నారు. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ నందమూరి తారకరామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని గుర్తుచేశారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారన్నారు. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశమని కొనియాడారు. నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజల మన్ననలతో తెలుగుదేశం దూసుకువెళ్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజాభీష్టమే పార్టీ తమలక్ష్యంగా పనిచేస్తోందన్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని గొప్పతనం తెలుగుదేశానికి మాత్రమే సొంతం అవడానికి కారణం కార్యకర్తలు, శ్రేణుల కృషి నిబద్ధతేనని అన్నారు. ఎంతోమంది తెలుగుదేశాన్ని అంతమొందించాలని చూసినా వారే అంతమయ్యారు తప్ప పార్టీ చెక్కుచెదరలేదన్నారు. తెలుగువారు ఉన్నంతవరకు తెలుగుదేశం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని గొట్టిపాటి రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సీఎం కావాలని చెప్పుల్లేకుండా ఐదేళ్లు దీక్ష - తిరుమలకు పాదయాత్ర

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత - ప్రతి బుధవారం వారి కోసం

TDP 43RD FORMATION DAY: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ నేతలు, శ్రేణులు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమని అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమని కొనియాడారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా అని అన్నారు. తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన, తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిందన్నారు. ఆడపడుచులకు అండగా నిలిచిందని, రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా అని సీఎం కొనియాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా అని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని చంద్రబాబు కొనియాడారు.

సభ్యత్వాలలో అసాధారణ రికార్డు: దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశమన్నారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి, తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ, చారిత్రాత్మక దినమైన నేటి రోజున ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేశారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని చంద్రబాబు నినదించారు.

ఆవిర్భావమే ఒక సంచలనం: తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రగతి - ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమన్నారు. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ నందమూరి తారకరామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని గుర్తుచేశారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారన్నారు. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశమని కొనియాడారు. నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజల మన్ననలతో తెలుగుదేశం దూసుకువెళ్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజాభీష్టమే పార్టీ తమలక్ష్యంగా పనిచేస్తోందన్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని గొప్పతనం తెలుగుదేశానికి మాత్రమే సొంతం అవడానికి కారణం కార్యకర్తలు, శ్రేణుల కృషి నిబద్ధతేనని అన్నారు. ఎంతోమంది తెలుగుదేశాన్ని అంతమొందించాలని చూసినా వారే అంతమయ్యారు తప్ప పార్టీ చెక్కుచెదరలేదన్నారు. తెలుగువారు ఉన్నంతవరకు తెలుగుదేశం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని గొట్టిపాటి రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సీఎం కావాలని చెప్పుల్లేకుండా ఐదేళ్లు దీక్ష - తిరుమలకు పాదయాత్ర

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత - ప్రతి బుధవారం వారి కోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.