ETV Bharat / state

పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి: మంత్రి నారాయణ - MUNICIPAL COMMISSIONERS WORKSHOP

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ - ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు

Minister narayana
Minister narayana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 10, 2025 at 3:01 PM IST

1 Min Read

Municipal Commissioners Workshop: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో పేదలకు ఇబ్బంది కలిగించకుండా పన్ను బకాయిలను ఓ ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై వర్క్​షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పని చేయాలని మంత్రి అన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, తాగునీరు ఇబ్బంది లేకుండా చూడటం, వీధి దీపాల ఏర్పాటు, ఉద్యాన వనాల అభివృద్ధి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న మెరుగైన విధానాలపై అధ్యయనం చేయించామని, వాటిలో మన ప్రాంతంలో అమలు చేసేందుకు ఉన్న అంశాలపై మేథోమథనం జరిపి ఆచరణలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

"ప్రజల అవసరాలను తీర్చి, మరింత మెరుగ్గా సేవ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలోని ప్రజలు కోరుకునేది తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, వేస్ట్ మేనేజ్​మెంట్. వాటి తరువాత పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, అర్బన్ స్కూళ్లు. ఇలా వీటన్నింటిని ఇంకా మరింత మెరుగ్గా చెయ్యడానికి ఏం చేయాలి అనే దానిపై వివిధ రాష్ట్రాలకు అధికారులను పంపించాం. అక్కడ అనుసరిస్తున్న వాటిలో ఏమైనా మంచివి ఉంటే అమలు చేస్తాం. దానిపైన ప్రస్తుతం వర్క్​షాప్ నిర్వహిస్తున్నాం". - నారాయణ, మంత్రి

గుడ్​న్యూస్​ - త్వరలో డ్వాక్రా సంఘాలకు రూ.8000 కోట్లు

Municipal Commissioners Workshop: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో పేదలకు ఇబ్బంది కలిగించకుండా పన్ను బకాయిలను ఓ ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై వర్క్​షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పని చేయాలని మంత్రి అన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, తాగునీరు ఇబ్బంది లేకుండా చూడటం, వీధి దీపాల ఏర్పాటు, ఉద్యాన వనాల అభివృద్ధి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న మెరుగైన విధానాలపై అధ్యయనం చేయించామని, వాటిలో మన ప్రాంతంలో అమలు చేసేందుకు ఉన్న అంశాలపై మేథోమథనం జరిపి ఆచరణలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

"ప్రజల అవసరాలను తీర్చి, మరింత మెరుగ్గా సేవ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలోని ప్రజలు కోరుకునేది తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, వేస్ట్ మేనేజ్​మెంట్. వాటి తరువాత పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, అర్బన్ స్కూళ్లు. ఇలా వీటన్నింటిని ఇంకా మరింత మెరుగ్గా చెయ్యడానికి ఏం చేయాలి అనే దానిపై వివిధ రాష్ట్రాలకు అధికారులను పంపించాం. అక్కడ అనుసరిస్తున్న వాటిలో ఏమైనా మంచివి ఉంటే అమలు చేస్తాం. దానిపైన ప్రస్తుతం వర్క్​షాప్ నిర్వహిస్తున్నాం". - నారాయణ, మంత్రి

గుడ్​న్యూస్​ - త్వరలో డ్వాక్రా సంఘాలకు రూ.8000 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.