ETV Bharat / state

అయ్యో పాపం - శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మరణ మృదంగం - SRIKURMAM TORTOISES DEATH INCIDENT

రెండు రోజుల్లో 15 జీవుల కన్నుమూత - గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది

Srikurmam Tortoises Death Incident
Srikurmam Tortoises Death Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 21, 2025 at 1:14 PM IST

1 Min Read

Srikurmam Tortoises Death Incident : శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు, తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు.

ఆదివారం ఉదయం మరణించిన కొన్ని కూర్మాలను అక్కడ పని చేసే ఓ వ్యక్తి శ్వేతపుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా ఏడు మృతి చెందిన కూర్మాలు, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.

పర్యవేక్షణ లోపమే కారణం : కూర్మనాథ క్షేత్రం పార్కులో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళంలో ఉండడం, స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారం మృత్యువాత పడిన కూర్మాలకు పోస్ట్​మార్టం నిర్వహించి ఖననం చేయాలి.

ఇవేమీ ఇక్కడ జరగకపోగా క్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా వాటిని దహనం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గుత్తేదారు రమణమూర్తిని వివరణ కోరగా ఆదివారం రెండు కూర్మాలు మాత్రమే చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మరోవైపు దీనిపై స్పందించిన దేవదాయశాఖ సహాయ కమిషనర్​ (ఇంఛార్జ్​) భద్రాజీ సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటామని వివరించారు.

ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత - సంరక్షణపై అధికారుల అధ్యయనం

అయ్యో తీరంలో తాబేళ్లకు ఆపద - రక్షించుకుందాం రండి!

Srikurmam Tortoises Death Incident : శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు, తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు.

ఆదివారం ఉదయం మరణించిన కొన్ని కూర్మాలను అక్కడ పని చేసే ఓ వ్యక్తి శ్వేతపుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా ఏడు మృతి చెందిన కూర్మాలు, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.

పర్యవేక్షణ లోపమే కారణం : కూర్మనాథ క్షేత్రం పార్కులో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళంలో ఉండడం, స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారం మృత్యువాత పడిన కూర్మాలకు పోస్ట్​మార్టం నిర్వహించి ఖననం చేయాలి.

ఇవేమీ ఇక్కడ జరగకపోగా క్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా వాటిని దహనం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గుత్తేదారు రమణమూర్తిని వివరణ కోరగా ఆదివారం రెండు కూర్మాలు మాత్రమే చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మరోవైపు దీనిపై స్పందించిన దేవదాయశాఖ సహాయ కమిషనర్​ (ఇంఛార్జ్​) భద్రాజీ సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటామని వివరించారు.

ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత - సంరక్షణపై అధికారుల అధ్యయనం

అయ్యో తీరంలో తాబేళ్లకు ఆపద - రక్షించుకుందాం రండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.