ETV Bharat / state

ఆకర్షణీయమైన జీతం అంటూ ప్రకటనలు ఇస్తారు - నమ్మి వెళితే 'నిర్బంధ చాకిరీ' చేయిస్తారు - CYBERCRIME IN GULF COUNTRIES

రాష్ట్రంలో పెరుగుతున్న గల్ఫ్​ దేశాల బాధితులు - తప్పుడు ఉద్యోగాల పేరుతో సైబర్​ దాడులు

Cyber Crimes
Cyber Crimes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 18, 2025 at 1:01 PM IST

2 Min Read

Cyber Crimes : రాష్ట్రంలో చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్​, ఇతర దేశాలకు వలస వెళుతుంటారు. వీరి ఆసక్తిని ఆసరాగా తీసుకొని తప్పుడు ఉద్యోగాల పేరుతో కొందరు దళారులు వారిని సైబర్​ ముఠాలకు అప్పగించేస్తున్నారు. ఇవి బాగా పెరిగిపోయాయి. పాస్​పోర్టు అప్పగించి నిర్బంధ కేంద్రాల్లో గంటల కొద్దీ పని చేయించుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీనికి ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో నమోదవుతున్న కేసులే నిదర్శనం. ఇక్కడే సుమారు 3 లక్షల మంది ఉపాధి కోసం గల్ఫ్​ దేశాలకు వలస వెళుతున్నారు.

ముందుగా సోషల్​ మీడియాలో కాల్​ సెంటర్​, డేటా ఎంట్రీ ఆపరేటర్​ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతాలు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్​, మయన్మార్​, థాయిలాండ్​లకు రప్పించి, అప్పటికే అక్కడి ముఠాలు పదుల సంఖ్యలో అడ్డాలను ఏర్పాటు చేసుకొని ఉంటాయి. తమ వలకు చిక్కిన యువకులు విమానాశ్రయాల్లో దిగగానే ముఠా సభ్యులు తమ ప్రాంతాలకు తరలించి పాస్​పోర్టు లాగేసుకుంటున్నారు. అక్కడ సైబర్​ నేరాలు ఎలా చేయాలన్న విషయమై మెళకువలు నేర్పిస్తారు. మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ నరక కూపం నుంచి బయటపడేందుకు ధైర్యం చేసిన వారు, అక్కడి భారత ఎంబసీకి ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే వారి కబంధాల నుంచి విముక్తి లభిస్తోంది.

మానవ అక్రమ రవాణా హబ్​గా మయన్మార్​ : ప్రస్తుతం టీజీసీఎస్​బీ ఆయా నేరాలపై దృష్టిని కేంద్రీకరించింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా హబ్​గా మారిన మయన్మార్​లోని సైబర్​ నేరాల అడ్డాలకు తెలంగాణ యువకులను పంపిస్తున్న ఏజెంట్లపై చర్యలకు పూనుకుంది. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్​ జిల్లాలో బాధితులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పలు సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్లలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. టీజీసీఎస్​బీ లోతుగా విచారణ చేపట్టగా మయన్మార్​లోనూ సైబర్​ ముఠాలను గుర్తించారు. ఫిబ్రవరి 21న మయన్మార్​ మిలటరీ దాడి చేసి మరికొంత మందిని కాపాడింది. అందులో ఇద్దరు కరీంనగర్​ వ్యక్తులు ఉన్నారు.

టామ్​కామ్​ను విస్తరిస్తే ఎంతో మేలు : గల్ఫ్​ దేశాల్లో ఉపాధి చూపుతున్న టామ్ ​కామ్ ​(తెలంగాణ మ్యాన్​ పవర్​ ఓవర్సీస్​ కంపెనీ)ని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తే నకిలీ వీసాల మోసాల బారినపడకుండా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఎమిగ్రేషన్​ వెబ్​సైట్​లోని సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని టీజీసీఎస్​బీ సూచిస్తోంది.

టార్గెట్​ రీచ్​ కాకుంటే ఎండలో నిల్చోవాలి - కప్పలా గెంతాలి!

ఆన్​లైన్​లో ఫేక్​ ప్రచారాలు, నకిలీ ప్రొఫైల్స్​ క్రియేట్​ చేస్తున్నారా? - ఇకనుంచి అంత ఈజీ కాదు

Cyber Crimes : రాష్ట్రంలో చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్​, ఇతర దేశాలకు వలస వెళుతుంటారు. వీరి ఆసక్తిని ఆసరాగా తీసుకొని తప్పుడు ఉద్యోగాల పేరుతో కొందరు దళారులు వారిని సైబర్​ ముఠాలకు అప్పగించేస్తున్నారు. ఇవి బాగా పెరిగిపోయాయి. పాస్​పోర్టు అప్పగించి నిర్బంధ కేంద్రాల్లో గంటల కొద్దీ పని చేయించుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీనికి ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో నమోదవుతున్న కేసులే నిదర్శనం. ఇక్కడే సుమారు 3 లక్షల మంది ఉపాధి కోసం గల్ఫ్​ దేశాలకు వలస వెళుతున్నారు.

ముందుగా సోషల్​ మీడియాలో కాల్​ సెంటర్​, డేటా ఎంట్రీ ఆపరేటర్​ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతాలు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్​, మయన్మార్​, థాయిలాండ్​లకు రప్పించి, అప్పటికే అక్కడి ముఠాలు పదుల సంఖ్యలో అడ్డాలను ఏర్పాటు చేసుకొని ఉంటాయి. తమ వలకు చిక్కిన యువకులు విమానాశ్రయాల్లో దిగగానే ముఠా సభ్యులు తమ ప్రాంతాలకు తరలించి పాస్​పోర్టు లాగేసుకుంటున్నారు. అక్కడ సైబర్​ నేరాలు ఎలా చేయాలన్న విషయమై మెళకువలు నేర్పిస్తారు. మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ నరక కూపం నుంచి బయటపడేందుకు ధైర్యం చేసిన వారు, అక్కడి భారత ఎంబసీకి ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే వారి కబంధాల నుంచి విముక్తి లభిస్తోంది.

మానవ అక్రమ రవాణా హబ్​గా మయన్మార్​ : ప్రస్తుతం టీజీసీఎస్​బీ ఆయా నేరాలపై దృష్టిని కేంద్రీకరించింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా హబ్​గా మారిన మయన్మార్​లోని సైబర్​ నేరాల అడ్డాలకు తెలంగాణ యువకులను పంపిస్తున్న ఏజెంట్లపై చర్యలకు పూనుకుంది. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్​ జిల్లాలో బాధితులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పలు సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్లలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. టీజీసీఎస్​బీ లోతుగా విచారణ చేపట్టగా మయన్మార్​లోనూ సైబర్​ ముఠాలను గుర్తించారు. ఫిబ్రవరి 21న మయన్మార్​ మిలటరీ దాడి చేసి మరికొంత మందిని కాపాడింది. అందులో ఇద్దరు కరీంనగర్​ వ్యక్తులు ఉన్నారు.

టామ్​కామ్​ను విస్తరిస్తే ఎంతో మేలు : గల్ఫ్​ దేశాల్లో ఉపాధి చూపుతున్న టామ్ ​కామ్ ​(తెలంగాణ మ్యాన్​ పవర్​ ఓవర్సీస్​ కంపెనీ)ని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తే నకిలీ వీసాల మోసాల బారినపడకుండా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఎమిగ్రేషన్​ వెబ్​సైట్​లోని సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని టీజీసీఎస్​బీ సూచిస్తోంది.

టార్గెట్​ రీచ్​ కాకుంటే ఎండలో నిల్చోవాలి - కప్పలా గెంతాలి!

ఆన్​లైన్​లో ఫేక్​ ప్రచారాలు, నకిలీ ప్రొఫైల్స్​ క్రియేట్​ చేస్తున్నారా? - ఇకనుంచి అంత ఈజీ కాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.