Trading Cheating In Guntur District : తమ ట్రేడింగ్ కంపెనీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మూడు నెలల్లో రెట్టింపు లాభం వస్తుందని నమ్మబలికి నిర్వాహకులు ఏకంగా రూ.56 లక్షలు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన తోకల రాజవర్దన్రావు అధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ చేసి కొంతకాలం నుంచి అతని భార్యతో కలిసి వెటర్నరీ కాలనీలో ఉంటున్నారు. వారు ఉంటున్న అపార్టెమెంట్లోని కింద ఫ్లోర్లో కొప్పకొండ లక్ష్మి నివాసం ఉంటోంది.
లక్ష్మి తరుచూ రాజవర్దన్రావుతో మంచిగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంది. తమకు యుక్లాస్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఉందని, దానికి పార్టనర్స్ అంటూ గంగాధర్, వంకాయలపాటి పావనిలను పరిచయం చేసింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో రెట్టింపు లాభం వస్తుందని వారంతా నమ్మబలికారు. రాజవర్దన్రావు బ్యాంకు ఖాతా నుంచి గత ఏడాది ఆగస్టులో పలు దపాలుగా రూ.56 లక్షల నగదును లక్ష్మీతోపాటు ఆమె భర్త దయాకర్, తల్లి శ్యామల ఖాతాలకు బదిలీ చేశారు.
వారే కాకుండా యుక్లాస్ కంపెనీ రీజనల్ మేనేజర్ అంటూ కావ్య కూడా రాజవర్దన్తో పెట్టుబడి పెట్టించేలా నమ్మకం కలిగించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి నగదు గురించి అడిగితే మాట దాట వేస్తున్నారు. ఇటివల గట్టిగా నిలదీయగా తాము డబ్బు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఈ నెల 9న ఫిర్యాదు చేయగా మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ వలలో మహిళా రైతు - ఒక్క క్లిక్తో రూ.99 వేలు మాయం
కిలేడీ: ఇంటి సమీపంలో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగులతో మంచిగా మెలగడం వారికి చిన్న చిన్న సహాయలు చేయడం, వారి ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెడుతున్నారో గమనించడం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడం ఇది వంకాయలపాటి పావని నైజం. ఆమెపై పటమట పోలీస్ స్టేషన్లో మూడు దొంగతనం కేసులున్నాయి. రెండు రోజుల కిందట సీసీఎస్ పోలీసులు పావనిని అదుపులోకి తీసుకొని ఆమె నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.