ETV Bharat / state

అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చే సిమ్‌ బాక్స్‌ - హైదరాబాద్​లో ముఠా సభ్యుల అరెస్ట్

మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ ఫిర్యాదుల కోసం ‘చక్షు’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ - హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి మేసపూరిత కాల్స్‌ వస్తున్నట్లు గుర్తించిన అధికారులు - సిమ్‌బాక్స్‌తో పాటు 200 సిమ్‌కార్డులు స్వాధీనం

Simbox Fraud In Hyderabad
Simbox Fraud In Hyderabad (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : September 12, 2025 at 2:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

Simbox Fraud In Hyderabad : అంతర్జాతీయ ఫోన్​ కాల్స్​ను స్థానిక కాల్స్​గా మార్చే టెక్నాలజీ పేరు సిమ్​ బాక్స్. వీటిని నడుపుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు బ్యూరో సంచాలకులు శిఖాగోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

'చక్షు' పేరుతో ప్రత్యేక పోర్టల్ : ప్రకటనలోని వివరాల ప్రకారం మోసపూరిత ఫోన్​ కాల్స్​కు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు టెలికాంశాఖ 'చక్షు' పేరుతో ప్రత్యేక పోర్టల్​ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్​కు ఇటీవల ఓ కంప్లెంట్ వచ్చింది. దానిలో ఒక అన్​నోన్​ నంబరు నుంచి ఫోన్​ చేసి తమను మోసం చేశారని బాధితుడు ఈ పోర్టల్​లో పేర్కోన్నారు. దీంతో టెలికాం అధికారులు ఈ సమాచారాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యారోకు పంపారు. దీని ఆధారంగా అక్కడి అధికారులు టెలికాంశాఖ (డాట్) సహకారంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో దాడి జరిపి సిమ్​బాక్స్​తో పాటు 200 సిమ్​కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి హఫీజ్​బాబానగుర్​కు చెందిన హిదయుల్లా(28), ఆహద్​ఖాన్​(25), చాంద్రాయణగుట్టకు చెందిన షేక్​ షోయబ్​ (24)లను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోనికి వచ్చాయి.

నష్టపోయిన సొమ్ము రాబట్టుకునేందుకు : ఈ కేసులో ప్రధాన నిందితుడు హిదయుల్లా కార్ల వ్యాపారంలో నష్టపోయాడు. పబ్​ వద్ద కలిసిన ఒక వ్యక్తికి జరిగిన విషయాన్ని చెప్పాడు. సదరు వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ఒక ఆన్​లైన్ గ్రూప్​లో చేరి అక్కడ కూడా రూ.16 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. దాంతో అదే వ్యక్తి హిదయుల్లాకు వాట్సప్​ ద్వారా హాంకాంగ్​కు చెందిన వెనీసా అనే మహిళను పరిచయం చేశాడు.

ఈ క్రమంలో ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపార ప్రచారం కోసం సిమ్​బాక్స్​ ఏర్పాటు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిదయుల్లాకు కొరియర్ ద్వారా సిమ్​బాక్స్​ అందింది. అంతర్జాతీయంగా వచ్చే 'వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్​' కాల్స్​ను ఈ సిమ్​బాక్స్ లోకల్ కాల్స్​గా మారుస్తుంది. ​దీనికి భారీగా స్థానిక సిమ్​కార్డులు అవసరం ఉంటుంది.

నిర్మాణ కార్మికులకు ధ్రువపత్రాలతో : ఇందుకోసం హిదయుల్లా సిమ్​కార్డుల వ్యాపారి అహద్​ఖాన్​ను, ఆయన ద్వారా షోయబ్​ను సంప్రదించాడు. వీరంతా కలిసి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు సిమ్​కార్డులు అమ్మి, వారి ధ్రువపత్రాలతో 500 సిమ్​కార్డులు సేకరించారు. వీటిని సిమ్​బాక్స్​లో పెట్టివీవోఐపీ కాల్స్​ను స్థానిక కాల్స్​గా మార్చడం మొదలుపెట్టారు.

నిందితులు అరెస్ట్ : ఈ నేరం కారణంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో సంబంధం ఉన్నవారితో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో సైబర్​సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సూర్యప్రకాశ్​, సీఐలు రమేశ్​, శ్రీనునాయక్​, డి.శ్రీను, ఎస్సైలు రాము నాయక్​లతో పాటు డాట్ ఏడీజీ (సెక్యూరిటీ) అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ అరెస్ట్ లేనే లేదు - అయినా ఎందుకు స్కామర్లకు చిక్కుతున్నారు?

ఆ నంబర్స్ నుంచి​ కాల్​ వస్తే తప్పకుండా కేటుగాళ్లే - 'రిక్విన్'​తో సైబర్​ నేరాలకు చెక్!