ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి - ROAD ACCIDENT IN NELLOR

ఆటోను ఢీకొన్న కారు - ప్రమాదస్థలంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

ROAD ACCIDENT IN NELLOR
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 5, 2025 at 7:45 AM IST

Updated : June 5, 2025 at 8:55 AM IST

1 Min Read

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్​ పేట క్రాస్​ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొంది. వెంకటరావుపల్లి నుంచి పలువురు కూలీలు పొగాకు గ్రేడింగ్​ పనులకు ఆటోలో తెల్లపాడు వెళ్తుండగా ఏఎస్​రావుపేట క్రాస్​ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి (ETV Bharat)

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్​: నెల్లూరు జిల్లా ప్రమాదంపై మంత్రి నారా లోకేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొగాకు గ్రేడింగ్‌ కోసం వెళ్తున్న కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు మృతి బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి - మంత్రులు దిగ్భ్రాంతి

డివైడర్​ను ఢీకొట్టి బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్ - వీడియో వైరల్

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్​ పేట క్రాస్​ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొంది. వెంకటరావుపల్లి నుంచి పలువురు కూలీలు పొగాకు గ్రేడింగ్​ పనులకు ఆటోలో తెల్లపాడు వెళ్తుండగా ఏఎస్​రావుపేట క్రాస్​ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి (ETV Bharat)

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్​: నెల్లూరు జిల్లా ప్రమాదంపై మంత్రి నారా లోకేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొగాకు గ్రేడింగ్‌ కోసం వెళ్తున్న కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు మృతి బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి - మంత్రులు దిగ్భ్రాంతి

డివైడర్​ను ఢీకొట్టి బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్ - వీడియో వైరల్

Last Updated : June 5, 2025 at 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.