Road Accident in Kadapa District : కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలను స్కార్పియో వాహనం వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్, మరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అత్యంత వేగంగా నడింపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును, పోలీసు రక్షక వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
అక్కడికక్కడే ముగ్గురు మృతి : ఈ తాకిడికి స్కార్పియో వాహనం టాప్ మొత్తం లేచిపోయి పక్కకు పడింది. ఆ సీట్లలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ప్రమాదంలో పోలీసు వాహనం పక్కనే ఉన్న మరో చెట్టుకు ఢీకొనడంతో అందులో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డి, డ్రైవరు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. స్కార్పియో వాహనంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు నంద్యాల జిల్లా కేంద్రమైన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు నెల్లూరుజిల్లా రాపూరులో రోడ్డు ప్రమాదం ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రాపూరులోని తిక్కన పార్కు వద్ద బైక్ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సరస్వతి (40), సురేష్ (30)గా గుర్తించారు.
బైక్పై నుంచి కిందపడిన పాస్టర్ ప్రవీణ్ - వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం- గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కోని ముగ్గురు మృతి