ETV Bharat / state

ప్రణాళిక లోపంతో ప్రయాణికుల జేబులకు చిల్లు - చుక్కలు చూపిస్తున్న 'చర్లపల్లి' - CHARLAPALLY RAILWAY TERMINAL

చర్లపల్లిలో ద.మ.రైల్వే ప్రణాళిక లోపంతో ప్రయాణికులు అవస్థలు - ఛార్జీల మోతతో ప్రయాణికుల బెంబేలు - సమస్యకు పరిష్కారం చూపాలంటూ విన్నపాలు

Charlapally Railway Terminal Issue
Charlapally Railway Terminal Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2025 at 2:49 PM IST

3 Min Read

Charlapally Railway Terminal Issue : చర్లపల్లి రైల్వే టెర్మినల్​ రైల్వే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్​తో మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా చర్లపల్లికి చేరుకోవాలంటే దగ్గరగా ఉంటే 40-45 నిమిషాలు, కాస్త దూరంగా ఉంటే గంట సమయం, ఇంకాస్త దూరంగా ఉంటే అంటే గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చేరుకోవాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. రవాణా సదుపాయాలు ఉన్నా, ఆర్టీసీ బస్సులు మాత్రం నామమాత్రమే. ఆటో, క్యాబ్​ ఎక్కితే వాడికి ఆస్తులు రాసినంత పని అవుతోంది.

ఉదాహరణకు ఆదిలాబాద్​కు చెందిన కృష్ణ సికింద్రాబాద్​ స్టేషన్​లో కృష్ణా ఎక్స్​ప్రెస్​ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి కేవలం ఐదు నిమిషాల్లో రూ.10 ఛార్జితో వెళ్లేవాడు. కానీ ఇప్పుడు రైలు నగరానికి రాకుండా చర్లపల్లి టెర్మినల్​కే పరిమితం కావడంతో చిలకలగూడ వెళ్లేందుకు 40-45 నిమిషాలు సమయం పెరిగిపోయింది. ఆటో, క్యాబ్​ ఖర్చులు అయితే రూ.250-రూ.300 వరకు అవుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అయితే ఆటో, క్యాబ్​ ఖర్చు రూ.1000కి పైమాటే. పైగా వాయు కాలుష్యం విపరీతం. పిల్లలు, లగేజీతో వెళ్లేవారు, వచ్చేవారు ఆటోలు, క్యాబ్​లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది.

చర్లపల్లి టెర్మినల్​ నుంచి బయలుదేరే రైళ్లు భువనగిరి, వరంగల్​ వైపు వెళతాయి. దాదాపు 18 రైళ్లు బయల్దేరి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. కేవలం కృష్ణా ఎక్స్​ప్రెస్​లో ఆదిలాబాద్​ నుంచి చర్లపల్లికి రైలు టికెట్​ సెకండ్ సిటింగ్​ రూ.175 కాగా, స్లీపర్​ రూ.295. కానీ చర్లపల్లిలో దిగాక ఆటో, క్యాబ్​లో చిలకలగూడ వెళ్లేందుకు రూ.300 వరకు ఖర్చు అవుతోంది. రాత్రిపూట అయితే వారు ఎంత ఛార్జీ అడుగుతారో చెప్పలేం.

ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకే చర్లపల్లి టెర్మినల్​ : సికింద్రాబాద్​, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి నుంచి పలు రైళ్లను రైల్వే అధికారులు నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లు ఆ స్టేషన్ల ప్లాట్​పారంపై 20-30 నిమిషాల వరకూ ఆగుతాయి. ఇక్కడ ఆ బండి కదిలిన తర్వాతే మరో బండి రావడానికి అవకాశం ఉంది. అందుకే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చారు. ఇక్కడ వరంగల్​, ఏపీ వైపు వెళ్లే రైళ్లకు బదులుగా ముంబయి, పుణే, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తే ప్రయోజనం ఉండనుంది.

హుస్సేన్​సాగర్​, ముంబయి ఎక్స్​ప్రెస్​, పుణె శతాబ్ది ఎక్స్​ప్రెస్​ వంటి రైళ్లకు ఉపయోగిస్తే అక్కడ్నుంచి బయల్దేరే రైళ్లు సికింద్రాబాద్​, లింగంపల్లి, బేగంపేట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లకు సమీపంలో ఉండేవారు సమీపంలోనే రైలు ఎక్కడానికి, దిగడానికి ఆస్కారం సైతం ఉండనుంది. మధ్యలో సికింద్రాబాద్​, బేగంపేట, లింగంపల్లి, కాచిగూడలో 2-5 నిమిషాలు ఆపితే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే ప్రధాన స్టేషన్​పై గతంలో మాదిరి ఒత్తిడి అనేది ఉండదు.

ద.మ.రైల్వే జీఎంకు ఎంపీల విజ్ఞప్తులు : పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడపడం వల్ల సమస్యలు వస్తున్నాయని కొందరు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఆదిలాబాద్​ ఎంపీ నగేశ్​ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి కృష్ణా ఎక్స్​ప్రెస్​ను గతంలో మాదిరి సికింద్రాబాద్​ స్టేషన్​ మీదుగా నడిపించాలని కోరారు. ఆ రైలు సికింద్రాబాద్​కు వెళ్లకపోవడం వల్ల అదిలాబాద్​ నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారని వివరించగా, ఇదే తరహా సమస్యలను మరికొందరు ఎంపీలూ దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు.

Charlapally Railway Terminal Issue : చర్లపల్లి రైల్వే టెర్మినల్​ రైల్వే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్​తో మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా చర్లపల్లికి చేరుకోవాలంటే దగ్గరగా ఉంటే 40-45 నిమిషాలు, కాస్త దూరంగా ఉంటే గంట సమయం, ఇంకాస్త దూరంగా ఉంటే అంటే గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చేరుకోవాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. రవాణా సదుపాయాలు ఉన్నా, ఆర్టీసీ బస్సులు మాత్రం నామమాత్రమే. ఆటో, క్యాబ్​ ఎక్కితే వాడికి ఆస్తులు రాసినంత పని అవుతోంది.

ఉదాహరణకు ఆదిలాబాద్​కు చెందిన కృష్ణ సికింద్రాబాద్​ స్టేషన్​లో కృష్ణా ఎక్స్​ప్రెస్​ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి కేవలం ఐదు నిమిషాల్లో రూ.10 ఛార్జితో వెళ్లేవాడు. కానీ ఇప్పుడు రైలు నగరానికి రాకుండా చర్లపల్లి టెర్మినల్​కే పరిమితం కావడంతో చిలకలగూడ వెళ్లేందుకు 40-45 నిమిషాలు సమయం పెరిగిపోయింది. ఆటో, క్యాబ్​ ఖర్చులు అయితే రూ.250-రూ.300 వరకు అవుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అయితే ఆటో, క్యాబ్​ ఖర్చు రూ.1000కి పైమాటే. పైగా వాయు కాలుష్యం విపరీతం. పిల్లలు, లగేజీతో వెళ్లేవారు, వచ్చేవారు ఆటోలు, క్యాబ్​లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది.

చర్లపల్లి టెర్మినల్​ నుంచి బయలుదేరే రైళ్లు భువనగిరి, వరంగల్​ వైపు వెళతాయి. దాదాపు 18 రైళ్లు బయల్దేరి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. కేవలం కృష్ణా ఎక్స్​ప్రెస్​లో ఆదిలాబాద్​ నుంచి చర్లపల్లికి రైలు టికెట్​ సెకండ్ సిటింగ్​ రూ.175 కాగా, స్లీపర్​ రూ.295. కానీ చర్లపల్లిలో దిగాక ఆటో, క్యాబ్​లో చిలకలగూడ వెళ్లేందుకు రూ.300 వరకు ఖర్చు అవుతోంది. రాత్రిపూట అయితే వారు ఎంత ఛార్జీ అడుగుతారో చెప్పలేం.

ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకే చర్లపల్లి టెర్మినల్​ : సికింద్రాబాద్​, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి నుంచి పలు రైళ్లను రైల్వే అధికారులు నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లు ఆ స్టేషన్ల ప్లాట్​పారంపై 20-30 నిమిషాల వరకూ ఆగుతాయి. ఇక్కడ ఆ బండి కదిలిన తర్వాతే మరో బండి రావడానికి అవకాశం ఉంది. అందుకే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చారు. ఇక్కడ వరంగల్​, ఏపీ వైపు వెళ్లే రైళ్లకు బదులుగా ముంబయి, పుణే, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తే ప్రయోజనం ఉండనుంది.

హుస్సేన్​సాగర్​, ముంబయి ఎక్స్​ప్రెస్​, పుణె శతాబ్ది ఎక్స్​ప్రెస్​ వంటి రైళ్లకు ఉపయోగిస్తే అక్కడ్నుంచి బయల్దేరే రైళ్లు సికింద్రాబాద్​, లింగంపల్లి, బేగంపేట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లకు సమీపంలో ఉండేవారు సమీపంలోనే రైలు ఎక్కడానికి, దిగడానికి ఆస్కారం సైతం ఉండనుంది. మధ్యలో సికింద్రాబాద్​, బేగంపేట, లింగంపల్లి, కాచిగూడలో 2-5 నిమిషాలు ఆపితే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే ప్రధాన స్టేషన్​పై గతంలో మాదిరి ఒత్తిడి అనేది ఉండదు.

ద.మ.రైల్వే జీఎంకు ఎంపీల విజ్ఞప్తులు : పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడపడం వల్ల సమస్యలు వస్తున్నాయని కొందరు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఆదిలాబాద్​ ఎంపీ నగేశ్​ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి కృష్ణా ఎక్స్​ప్రెస్​ను గతంలో మాదిరి సికింద్రాబాద్​ స్టేషన్​ మీదుగా నడిపించాలని కోరారు. ఆ రైలు సికింద్రాబాద్​కు వెళ్లకపోవడం వల్ల అదిలాబాద్​ నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారని వివరించగా, ఇదే తరహా సమస్యలను మరికొందరు ఎంపీలూ దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.