Police on Alert During IPL Match in Uppal Stadium : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి దృష్ట్యా రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ వేదికగా హైదరాబాద్, ముంబయి జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మైదానానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ రాచకొండ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉప్పల్ స్టేడియం లోపల, బయట ప్రత్యేక నిఘా పెట్టారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి దృష్ట్యా అప్రమత్తమైన రాచకొండ పోలీసులు ఈ చర్యలను చేపట్టారు. కాగా ఉగ్రదాడికి నిరసనగా ఇరు జట్లు నల్లరంగు ఆర్మ్ బ్యాండ్స్ ధరించాయి. స్టేడియంలో క్రికెటర్లు, ప్రేక్షకులు నిమిషం పాటు మౌనం పాటించారు.
ఉగ్రదాడిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!- మోదీ అధ్యక్షతన CCS అత్యవసర సమావేశం
శ్రీనగర్లో చిక్కుకుపోయాం, స్వస్థలాలకు పంపండి - ప్రభుత్వానికి తెలంగాణ పర్యాటకుల విజ్ఞప్తి