Police Discover Huge Explosive Dump in Bapatla District : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు హైవే సమీపంలో టన్నులకొద్ది భారీ పేలుడు డంప్ కలకలం రేపింది. మండల స్థాయి వైఎస్సార్సీపీ నేత ఫ్యాక్టరీ, నివాసం, గోడౌన్లో కీలక సమాచారం లభ్యమైన్నట్లు తెలుస్తొంది.
టన్నుల కొద్దీ పేలుడు సామాగ్రి ఉన్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీకి నిఘావిభాగం అధికారులు సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టన్నుల కొద్దీ జిలెటెన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నారు. గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలెటెన్ స్టిక్స్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుస్తొంది.
వైఎస్సార్సీపీ నేతల భారీ రాజకీయ కుట్ర దిశగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అనుమతులు లేకుండా టన్నుల కొద్దీ జిలెటిన్ స్టిక్స్ రవాణాతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని అనుమానం వ్యక్తమవుతోంది. పలువురు వైఎస్సార్సీపీ నేతలు పరారీలో ఉన్నారు. పోలీసులు పూర్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు యంత్రాంగం సమాచారం అందిస్తోంది.
రీల్ కాదు రియల్.. గాల్లో ఎగిరిన ఆయిల్ ట్యాంకర్
పోలీసు వాహనంపై దాడి.. 8 మంది మృతి.. నది దాటుతూ మరో ఎనిమిది మంది