ETV Bharat / state

ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ భూతం - తీరని శోకంలో కన్నవారు - BETTING APP ADDICTION

సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న బెట్టింగ్స్ - ఈ ఆన్​లైన్​ గేమ్స్ ఆడుతూ ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తులు

Betting_app_addiction
Betting_app_addiction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 20, 2025 at 9:04 AM IST

2 Min Read

People Losing Their Lives Playing Betting Games: సమాజంలో బెట్టింగ్​లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. బెట్టింగ్‌ భూతం బారిన పడి ఎంతోమంది బలైపోతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్‌లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న బెట్టింగ్‌ యాప్‌ మరణాలు ఎన్నో కుటుంబాలను తీరని వేదనలో ముంచేశాయి. నరసరావుపేటకు చెందిన దంపతులు క్యాటరింగ్‌ పనులు చేస్తూ కుమారుడిని బీటెక్‌ చదివించారు. క్యాటరింగ్‌ లావాదేవీలన్నీ కుమారుడికి అప్పగించారు. అతను బెట్టింగ్‌లకు అలవాటుపడి తల్లిదండ్రులు సంపాదించిన రూ.10 లక్షలు పోగొట్టడమే కాకుండా మరో రూ. 13 లక్షలు అప్పు చేశాడు. చివరికతను ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లిదండ్రులు మానసిక వైద్యుల వద్దకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు.

హలో గురు 'గాలం వేస్తారు' జాగ్రత్త - వాటిని ఓపెన్ చేస్తే జీవితం ఉఫ్‌!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో బెట్టింగ్‌ యాప్‌ల విషవలయం:

  • 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు బలవన్మరణం చెందినవారు: 36 మంది (కేసుల్లో ఇతరత్రా కారణాలు కూడా చూపిస్తున్నారు)
  • ఆత్మహత్యాయత్నాలు: 126 మంది
  • బెట్టింగ్‌ల్లో కూరుకుపోయి మానసిక వేదనకు లోనై కౌన్సెలింగ్‌కు వచ్చినవారు: 558 మంది

కొత్తవారికి లాభాలతో ఆశ చూపిస్తున్నారు: బెట్టింగ్‌యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్న కొత్తవాళ్లకు తొలుత లాభాలు వచ్చేలా నిర్వాహకులు చూస్తారని గుంటూరు ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్యవిభాగం హెచ్‌వోడీ ఎన్‌. ఉమాజ్యోతి అంటున్నారు. దీంతో యువత ధైర్యం చేసి డబ్బులు పెట్టుబడి పెడుతున్నారని చివరికది అది వ్యసనంగా మారి దొరికినచోటల్లా అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ ఊబిలోకి దిగిపోతున్నారని చెప్పారు. బెట్టింగ్​ వలలోనుంచి బయటపడలేక డిప్రెషన్‌కు గురై ఎంతోమంది చనిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని మొదట్లోనే గుర్తించి అడ్డుకోవాలని సూచిస్తున్నారు. అప్పటికీ మారకపోతే మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ ఇప్పించాలని ఉమాజ్యోతి చెప్తున్నారు.

ఆన్​లైన్ గేమ్స్​ ఆడి రూ.24 లక్షలు పోగొట్టిన చిన్నారి! కూడబెట్టిన సొమ్మంతా ఒక్క 'క్లిక్​'తో హుష్​​కాకి!

చొక్కాపై ఆత్మహత్య కారకులు - ఆన్​లైన్ భూతానికి మరో వ్యక్తి బలి

People Losing Their Lives Playing Betting Games: సమాజంలో బెట్టింగ్​లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. బెట్టింగ్‌ భూతం బారిన పడి ఎంతోమంది బలైపోతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్‌లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న బెట్టింగ్‌ యాప్‌ మరణాలు ఎన్నో కుటుంబాలను తీరని వేదనలో ముంచేశాయి. నరసరావుపేటకు చెందిన దంపతులు క్యాటరింగ్‌ పనులు చేస్తూ కుమారుడిని బీటెక్‌ చదివించారు. క్యాటరింగ్‌ లావాదేవీలన్నీ కుమారుడికి అప్పగించారు. అతను బెట్టింగ్‌లకు అలవాటుపడి తల్లిదండ్రులు సంపాదించిన రూ.10 లక్షలు పోగొట్టడమే కాకుండా మరో రూ. 13 లక్షలు అప్పు చేశాడు. చివరికతను ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లిదండ్రులు మానసిక వైద్యుల వద్దకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు.

హలో గురు 'గాలం వేస్తారు' జాగ్రత్త - వాటిని ఓపెన్ చేస్తే జీవితం ఉఫ్‌!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో బెట్టింగ్‌ యాప్‌ల విషవలయం:

  • 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు బలవన్మరణం చెందినవారు: 36 మంది (కేసుల్లో ఇతరత్రా కారణాలు కూడా చూపిస్తున్నారు)
  • ఆత్మహత్యాయత్నాలు: 126 మంది
  • బెట్టింగ్‌ల్లో కూరుకుపోయి మానసిక వేదనకు లోనై కౌన్సెలింగ్‌కు వచ్చినవారు: 558 మంది

కొత్తవారికి లాభాలతో ఆశ చూపిస్తున్నారు: బెట్టింగ్‌యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్న కొత్తవాళ్లకు తొలుత లాభాలు వచ్చేలా నిర్వాహకులు చూస్తారని గుంటూరు ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్యవిభాగం హెచ్‌వోడీ ఎన్‌. ఉమాజ్యోతి అంటున్నారు. దీంతో యువత ధైర్యం చేసి డబ్బులు పెట్టుబడి పెడుతున్నారని చివరికది అది వ్యసనంగా మారి దొరికినచోటల్లా అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ ఊబిలోకి దిగిపోతున్నారని చెప్పారు. బెట్టింగ్​ వలలోనుంచి బయటపడలేక డిప్రెషన్‌కు గురై ఎంతోమంది చనిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని మొదట్లోనే గుర్తించి అడ్డుకోవాలని సూచిస్తున్నారు. అప్పటికీ మారకపోతే మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ ఇప్పించాలని ఉమాజ్యోతి చెప్తున్నారు.

ఆన్​లైన్ గేమ్స్​ ఆడి రూ.24 లక్షలు పోగొట్టిన చిన్నారి! కూడబెట్టిన సొమ్మంతా ఒక్క 'క్లిక్​'తో హుష్​​కాకి!

చొక్కాపై ఆత్మహత్య కారకులు - ఆన్​లైన్ భూతానికి మరో వ్యక్తి బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.