Penna Cements Chief Donates Gold Crowns To Vontimitta Temple: ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఇలాంటి సమయంలో శ్రీసీతారాముల వారికి ఓ భక్తుడు భారీ కానుక అందజేశారు.
శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు విరాళంగా అందజేశారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
కనకదుర్గ అమ్మవారికి మూడు బంగారు కిరీటాలు కానుక.. బరువు ఎంతంటే..?