Anna Lezhinova Donation to TTD SV Annadanam Trust: తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ అన్నదానం ట్రస్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.17,00,000 విరాళంగా అందజేశారు. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆ తర్వాత భక్తులతో కలిసి ఆమె కూడా అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆరా తీయగా బాగున్నాయని అన్నా లెజినోవా చెప్పారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ సతీమణి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు స్వీకరించారు.
వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో: పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్శంకర్ అగ్నిప్రమాదం నుంచి బయటడి కోలుకున్న నేపథ్యంలో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందురోజే తలనీలాలు సమర్పించి తిరుమలలో బసచేసిన ఆమె ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ అన్నాలెజినోవా వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు వద్ద లెజినోవాకు టీటీడీ అధికారి హరింద్రనాథ్ స్వాగతం పలికారు.
అన్నాలెజినోవా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ సిబ్బంది లెజినోవాకు తిరుమలేశుడి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం అన్నాలెజినోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గాయత్రి నిలయం అతిథి గృహానికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి అన్నాలెజినోవా చేరుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
Pawan Kalyan With Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన మార్క్ శంకర్కు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఆసుపత్రిలో మార్క్ శంకర్కు వైద్యం అందించారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ ప్రాంతంలో టమాటో కుకింగ్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆసుపత్రిలో అయిదు రోజుల పాటు వైద్య సేవలు పొందిన అనంతరం శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, తన కుమారుడు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు.
తిరుమలలో పవన్ సతీమణి అన్నాలెజినోవా - శ్రీవారికి తలనీలాలు సమర్పణ