Parthi Gang Theft In Hyderabad : పార్థి గ్యాంగ్కు చెందిన గంధపు చెక్కల దొంగలను హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. యూసఫ్గూడలోని ఎన్ఐ- ఎమ్ఎస్ఎమ్ఈ క్యాంపస్లో గంధపు చెక్కలు చేయడంతో పలాన్బాయి, షహ్నాజ్బాయి, నిమత్బాయి, మాధురి ఆదివాసీ అనే నలుగురు మహిళల్ని అరెస్టు చేశారు. 20 రోజుల క్రితం 23 మంది పార్థి గ్యాంగ్ సభ్యులు హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులందరూ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన వారని వెల్లడించారు.
పిల్లలు, మహిళల్ని ముందు పెట్టి : ముఠా సభ్యులు జూబ్లీహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంధపు చెక్కల దొంగతనాలకు పాల్పడుతున్నారని, వాటిని పరిచయస్థులైన స్థానిక స్మగ్లర్లకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా పిల్లలు, మహిళల్ని ముందు పెట్టి ఈ వ్యవహారాన్ని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ- ప్రియుడితో కలిసి సొంతింట్లోనే దొంగతనం!
చింతపండు చోరీ వెనక పెద్ద స్కెచ్ - ఐదు నెలలుగా కొనసాగుతున్న దందా!