Operation Karregutta Continues : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో తొమ్మిదో రోజు భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. బ్లాక్హిల్స్గా పేరుగాంచిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాలను సెక్యూరిటీ ఫోర్సెస్ తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్లో పాల్గొని అలసిన బలగాలు వెనక్కి వస్తున్నాయి. దీంతో వారి స్థానంలో బ్యాకప్ పార్టీలను తరలించారు.
డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు : మావోయిస్టుల ఆచూకీ కోసం ఉపగ్రహ(శాటిలైట్) ఛాయాచిత్రాలను వినియోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నడిపల్లి, పూజారీ కాంకేర్ ప్రాంతాలు మంగళవారం బాంబుల శబ్దాలతో హోరెత్తాయి. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ కోసం ఐబీ(ఇంటెలిజన్స్ బ్యూరో) చీఫ్ తపన్ దేకా రంగంలోకి దిగారు. రాయ్పుర్లో ఆపరేషన్పై అధికారులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
కర్రెగుట్టలో భారీ సొరంగం - నీటివసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు