ETV Bharat / state

నూతన వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లేఖ - PM MODI LETTER TO MARRIED COUPLE

నూతన వధూవరులకు ప్రధాని నుంచి వచ్చిన ఆశీర్వాద లేఖ - పెళ్లికి ఆహ్వానం పంపిన పెళ్లి కుమార్తె - ఆశీర్వదిస్తూ లేక పంపించిన ప్రధాని మోదీ

Newly Married Couple Gets Letter From PM Modi
Newly Married Couple Gets Letter From PM Modi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 7, 2025 at 11:33 PM IST

1 Min Read

Newly Married Couple Gets Letter From PM Modi : వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నుంచి లేఖ అందడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకెల్తే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్‌బాబు దంపతులకు కుమారుడు శివకుమార్, కూతురు గౌతమిలు ఉన్నారు. తండ్రి వారి చిన్నతనంలో మరణించారు. 2022 ఫిబ్రవరి 20న గౌతమికి బాపట్లకు చెందిన సుధీర్‌తో పెళ్లి జరిగింది.

తన పెళ్లికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తూ ఆమె పీఎం కార్యాలయానికి శుభలేఖను పంపించారు. పెళ్లికుమార్తె, కుమారుడు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయూరారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ అక్కడి నుంచి ప్రధాని సంతకంతో వారికి లేఖ వచ్చింది. శివకుమార్‌ 2025 మే 23న, జరిగిన తన పెళ్లికి ఆహ్వానిస్తూ అలాగే పెళ్లి పత్రికను పీఎమ్​ ఆఫీస్​కు పంపించారు. నూతన దంపతులను ఆశీర్వదిస్తూ మరోసారి ప్రధాని కార్యాలయం నుంచి గురువారం లేఖ అందినట్లు తల్లి సుగుణ తెలిపారు.

Newly Married Couple Gets Letter From PM Modi : వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నుంచి లేఖ అందడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకెల్తే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్‌బాబు దంపతులకు కుమారుడు శివకుమార్, కూతురు గౌతమిలు ఉన్నారు. తండ్రి వారి చిన్నతనంలో మరణించారు. 2022 ఫిబ్రవరి 20న గౌతమికి బాపట్లకు చెందిన సుధీర్‌తో పెళ్లి జరిగింది.

తన పెళ్లికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తూ ఆమె పీఎం కార్యాలయానికి శుభలేఖను పంపించారు. పెళ్లికుమార్తె, కుమారుడు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయూరారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ అక్కడి నుంచి ప్రధాని సంతకంతో వారికి లేఖ వచ్చింది. శివకుమార్‌ 2025 మే 23న, జరిగిన తన పెళ్లికి ఆహ్వానిస్తూ అలాగే పెళ్లి పత్రికను పీఎమ్​ ఆఫీస్​కు పంపించారు. నూతన దంపతులను ఆశీర్వదిస్తూ మరోసారి ప్రధాని కార్యాలయం నుంచి గురువారం లేఖ అందినట్లు తల్లి సుగుణ తెలిపారు.

విపత్తు నిర్వహణపై ప్రధాని మోదీ- ఈ విషయంలో 29 దేశాలకు భారత్ సాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.