Margadarsi New branch inaugurated in Nirmal : ఉత్తర తెలంగాణలో నిర్మల్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటుచేసిన మార్గదర్శి 123వ బ్రాంచి ప్రారంభోతవ్సం అట్టహాసంగా జరిగింది. నిర్మల్ ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఎంఎస్ టవర్లోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన శాఖను రామోజీ గ్రూప్ సీఎండీ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ప్రత్యేక పూజలతో : మార్గదర్శి సీఈవో సత్యానారాయణ, అడ్మిన్, డెవలప్మెంట్ వైస్ప్రెసిడెంట్లు రాజాజీ, బలరామకృష్ణ, డీజీఎం బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు. నిర్మల్ బ్రాంచి మేనేజర్ రాజేష్ను సీట్లో కూర్చోపెట్టి అభినందనలు తెలిపారు. నిర్మల్ సహా తానూరు, ముథోల్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఖాతాదారులు మార్గదర్శి సేవలను కొనియాడారు.
"ఈరోజు మార్గదర్శి నిర్మల్లో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు గత 25 సంవత్సరాల నుంచి మార్గదర్శితో అనుబంధం ఉంది. మార్గదర్శి నిర్మల్కు రావటం చాలా ఆనందదాయకం. షురిటీలు, వెరిఫికేషన్ అయిన నాలుగు రోజుల్లోనే వినియోగదారులకు మార్గదర్శి చెక్స్ అందిస్తోంది" -ప్రహ్మాద్ శర్మ, మార్గదర్శి ఖాతాదారుడు
చిత్రదుర్గలో మార్గదర్శి చిట్ఫండ్ 122వ శాఖను ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్
ఆభరణాల కొనుగోలు విషయంలో నమ్మకం చాలా ముఖ్యం : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్