ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ - బస్​పాస్​ ధరల పెంపునకు నిరసనగా ఆందోళన - MLC KAVITHA PROTEST

బస్​ పాస్​ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కవిత ఆందోళన - తెలంగాణ జాగృతి కార్యకర్తల బస్​భవన్​ ముట్టడి - కవితను అరెస్టు చేసి పీఎస్​కు తరలింపు

MLC Kavitha Protest
MLC Kavitha Protest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 10, 2025 at 7:09 PM IST

1 Min Read

MLC Kavitha Protest : రాష్ట్ర ప్రభుత్వం బస్​పాస్​ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు బస్​భవన్​ను ముట్టడించి, పెంచిన ధరలను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచన్​బాగ్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కాసేపటి తర్వాత కవితను పోలీసులు విడిచిపెట్టారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ - బస్​పాస్​ ధరల పెంపునకు నిరసనగా ఆందోళన (ETV Bharat)

పోలీస్​స్టేషన్​ నుంచి విడుదలైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బస్​పాస్​ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆవేదన చెందారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు రూ.300లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని వివరించారు. ప్రజలను దోచుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు 300 రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు బడిపోయింది. విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని మా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి." - కవిత, ఎమ్మెల్సీ

కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్‌ అయితే - రెండో కన్ను జాగృతి : ఎమ్మెల్సీ కవిత

నన్ను, కేసీఆర్‌ను విడదీసే కుట్ర : కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha Protest : రాష్ట్ర ప్రభుత్వం బస్​పాస్​ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు బస్​భవన్​ను ముట్టడించి, పెంచిన ధరలను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచన్​బాగ్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కాసేపటి తర్వాత కవితను పోలీసులు విడిచిపెట్టారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ - బస్​పాస్​ ధరల పెంపునకు నిరసనగా ఆందోళన (ETV Bharat)

పోలీస్​స్టేషన్​ నుంచి విడుదలైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బస్​పాస్​ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆవేదన చెందారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు రూ.300లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని వివరించారు. ప్రజలను దోచుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు 300 రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు బడిపోయింది. విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని మా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి." - కవిత, ఎమ్మెల్సీ

కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్‌ అయితే - రెండో కన్ను జాగృతి : ఎమ్మెల్సీ కవిత

నన్ను, కేసీఆర్‌ను విడదీసే కుట్ర : కవిత సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.