ETV Bharat / state

'ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ' ఇదీ విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి! : గంటా ట్వీట్ - GANTA POST ON FLIGHT SERVICES

విశాఖ-విజయవాడ విమాన సర్వీసుల రద్దు వల్ల ప్రయాణికుల ఇబ్బందులు - స్వీయ అనుభవాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న గంటా శ్రీనివాసరావు

Ganta Post on Flight Services
Ganta Post on Flight Services (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 15, 2025 at 8:06 PM IST

1 Min Read

Ganta Post on Flight Services : విశాఖపట్నం నుంచి విజయవాడకు పలు విమాన సర్వీసులు రద్దుకావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ ఫేస్‌బుక్‌లో తన పోస్టును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ట్యాగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి చేరుకోవాలంటే తెలంగాణలోని హైదరాబాద్‌ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు తన స్వీయ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్‌ విమానశ్రయానికి చేరుకున్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కోసం విశాఖ నుంచి బయల్దేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్‌ ప్రతినిధులు కూడా తన లాగే హైదరాబాద్‌ మీదుగా విజయవాడ చేరుకున్నారని పేర్కొన్నారు.

విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గంటా శ్రీనివాసరావు వివరించారు. దురదృష్టవశాత్తూ ఇవాళ మంగళవారం కావడంతో వందేభారత్‌ రైలు కూడా లేదని చెప్పారు. దీంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదీ విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు తన పోస్ట్​ను ట్యాగ్‌ చేశారు. దీంతో పాటు తాను రెండు విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టిక్కెట్లను సైతం గంటా షేర్‌ చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వెలవెల - కొన్ని కీలక సర్వీసులు రద్దు

విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు - ప్రయాణికుల ఆందోళన

Ganta Post on Flight Services : విశాఖపట్నం నుంచి విజయవాడకు పలు విమాన సర్వీసులు రద్దుకావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ ఫేస్‌బుక్‌లో తన పోస్టును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ట్యాగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి చేరుకోవాలంటే తెలంగాణలోని హైదరాబాద్‌ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు తన స్వీయ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్‌ విమానశ్రయానికి చేరుకున్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కోసం విశాఖ నుంచి బయల్దేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్‌ ప్రతినిధులు కూడా తన లాగే హైదరాబాద్‌ మీదుగా విజయవాడ చేరుకున్నారని పేర్కొన్నారు.

విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గంటా శ్రీనివాసరావు వివరించారు. దురదృష్టవశాత్తూ ఇవాళ మంగళవారం కావడంతో వందేభారత్‌ రైలు కూడా లేదని చెప్పారు. దీంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదీ విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు తన పోస్ట్​ను ట్యాగ్‌ చేశారు. దీంతో పాటు తాను రెండు విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టిక్కెట్లను సైతం గంటా షేర్‌ చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వెలవెల - కొన్ని కీలక సర్వీసులు రద్దు

విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు - ప్రయాణికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.