ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార భరోసా పంపిణీ - పాల్గొన్న మంత్రులు - FISHERIES SERVICE PROGRAM IN AP

మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి - రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రులు

Fisheries Service Program In Andhra Pradesh
Fisheries Service Program In Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 8:56 PM IST

1 Min Read

Minister Anagani Satya prasad Visit Bapatla District: మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 12, 671 మంది లబ్ధిదారులకు 25.34 కోట్ల చెక్కును కలెక్టర్ వెంకట మురళీ చేతుల మీదుగా మత్స్యకారులకు పంపిణీ చేశారు.

Minister Janardhan Reddy Visit Kakinada District: కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమళ్లపురంలో మంత్రి బి.సి. జనార్దన్‌రెడ్డి పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. మత్స్యకార భరోసా పది వేల నుంచి 20 వేలకు పెంచడంపై స్థానికులు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Minister Anitha Visit Anakapalli District: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని హోంమంత్రి అనిత కొనియాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 12 వేల మంది మత్యకారులకు 25 కోట్ల రూపాయల జీవన భృతిని అందిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.


మత్స్యకారుల జీవనప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తాం : సీఎం చంద్రబాబు

మత్స్యకారుల విడుదలపై కుటుంబ సభ్యుల హార్షం

Minister Anagani Satya prasad Visit Bapatla District: మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 12, 671 మంది లబ్ధిదారులకు 25.34 కోట్ల చెక్కును కలెక్టర్ వెంకట మురళీ చేతుల మీదుగా మత్స్యకారులకు పంపిణీ చేశారు.

Minister Janardhan Reddy Visit Kakinada District: కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమళ్లపురంలో మంత్రి బి.సి. జనార్దన్‌రెడ్డి పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. మత్స్యకార భరోసా పది వేల నుంచి 20 వేలకు పెంచడంపై స్థానికులు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Minister Anitha Visit Anakapalli District: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని హోంమంత్రి అనిత కొనియాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 12 వేల మంది మత్యకారులకు 25 కోట్ల రూపాయల జీవన భృతిని అందిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.


మత్స్యకారుల జీవనప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తాం : సీఎం చంద్రబాబు

మత్స్యకారుల విడుదలపై కుటుంబ సభ్యుల హార్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.