Minister Subhash Fire on ESI Hospital Employees: రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆస్పత్రిలో కొందరు వైద్యులు, సిబ్బంది తీరుపై కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకుండా హాజరు పట్టిలో సంతకాలు పెట్టేసి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తో పాటు ముగ్గురు డ్యూటీ డాకర్లు లేకపోవటంతో మంత్రి మండిపడ్డారు. సంస్థ డైరెక్టర్ ఆంజనేయులుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైద్యులకు మెమోలు జారీ చేయాలని, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ను బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రి వైద్యులు కొందరు విధులకు డుమ్మాకొట్టి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన ఈ ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యుల తీరుపై గతంలో కార్మిక సంఘాలు, ఈఎస్ఐ చందాదారులు ధర్నాలు చేసినా ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో తానే స్వయంగా ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించారు. వారి పని తీరుపై తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల వివరాలివ్వండి' - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
గులియన్ బారీ సిండ్రోమ్కి కారణాలు అవే - తేల్చిచెప్పిన అధికారులు