ETV Bharat / state

4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్‌ - MINISTER NARAYANA REVIEW MEETING

విశాఖ నూతన మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో సమావేశం- మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయం

minister_narayana_review_meeting_about_gvmc
minister_narayana_review_meeting_about_gvmc (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 21, 2025 at 4:53 PM IST

1 Min Read

Minister Narayana Review Meeting About GVMC : నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్‌ సిటీ విశాఖ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షించినట్లు తెలిపారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్‌ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని, విశాఖలో 600కు పైగా టీడీఆర్‌ బాండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్‌ త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా డీవియేషన్‌ జరిగిందని మంత్రి తెలిపారు.

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌ - రూ.11,498 కోట్లతో 46 కి.మీ. మెట్రో

అమరావతికి రూ.64,721 కోట్ల ఖర్చు - 2028 నాటికి పూర్తి: మంత్రి నారాయణ

Minister Narayana Review Meeting About GVMC : నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్‌ సిటీ విశాఖ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షించినట్లు తెలిపారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్‌ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని, విశాఖలో 600కు పైగా టీడీఆర్‌ బాండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్‌ త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా డీవియేషన్‌ జరిగిందని మంత్రి తెలిపారు.

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌ - రూ.11,498 కోట్లతో 46 కి.మీ. మెట్రో

అమరావతికి రూ.64,721 కోట్ల ఖర్చు - 2028 నాటికి పూర్తి: మంత్రి నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.