Minister Narayana and Team Two Days Gujarat Tour : ఆది, సోమ వారాల్లో గుజరాత్లో మంత్రి నారాయణ బృందం అధికారికంగా పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి మంత్రి నారాయణ, అధికారులు వెళ్తున్నారు. మంత్రి వెంట సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
రేపు(ఆదివారం) ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహం అధ్యయనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(GIFT city) ని మంత్రి పరిశీలించనున్నారు.
అలాగే అహ్మదాబాద్లోని CEPT యూనివర్సిటీ(సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ)సందర్శిస్తారని తెలుస్తోంది. రేపు రాత్రి అహ్మదాబాద్లో స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్నారు. ఎల్లుండి(సోమవారం) ఉదయం సబర్మతి రివర్ ఫ్రంట్ను మంత్రి బృందం పరిశీలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన - ఆరుగురు మంత్రులతో నిర్వహణ కమిటీ
అమరావతిలో వంపులు తిరుగుతూ వెళ్లనున్న 'కృష్ణమ్మ' - రెండువైపులా పార్కులు