ETV Bharat / state

'అమ్మానాన్నా - నా కుమారుడిని మీరే పెంచండి' - అద్దంపై సూసైడ్‌ నోట్‌ రాసి వివాహిత బలవన్మరణం - WOMAN DEAD IN JAGTIAL

జగిత్యాల జిల్లాలో వివాహిత ఆత్మహత్య - వరకట్నపు వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డ మహిళ

Married Woman Committed Suicide in Jagtial
Married Woman Committed Suicide in Jagtial (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 25, 2025 at 10:01 AM IST

1 Min Read

Married Woman Dead in Jagtial : జగిత్యాల జిల్లా పోచమ్మవాడలో బుధవారం సాయంత్రం వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ తీవ్రంగా కలచి వేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన గంగాధర్-శోభ దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్న (29)కు రెండు సంవత్సరాల క్రితం వెల్గటూరు మండలం రాంనూర్‌కు చెందిన తిరుపతితో వివాహం జరిగింది.

ఇద్దరూ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తుండగా, ఏడాది కిందట కుమారుడు జన్మించాడు. లక్ష్మీ ప్రసన్న ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుండగా భర్త, అత్తింటి వారు అదనపు కట్నంతో పాటు కుమారుడి పోలికపై అనుమానంతో వేధిస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఒప్పుకున్నారు. రూ.10 లక్షల నగదు చెల్లించారు. మిగతాది భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. 5 రోజుల కిందట బెంగళూరు నుంచి దంపతులిద్దరూ రాంనూర్‌కు చేరుకున్నారు.

అద్దంపై రాసి ఆత్మహత్య : బుధవారం గంగాధర్‌ రాంనూర్‌ వెళ్లి కుమార్తె, మనవడిని తీసుకొని జగిత్యాలకు వచ్చారు. సాయంత్రం ఇంట్లో అద్దంపై ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా కుమారుడు జాగ్రత్త. ప్లీజ్‌ వాళ్లకు మాత్రం ఇవ్వకండి’ అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త తిరుపతి, అత్తమామలు, ముగ్గురు ఆడబిడ్డలపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ డి.రఘుచందర్, పట్టణ సీఐ సూరం వేణు గోపాల్, తహసీల్దార్‌ సి.రాంమోహన్‌ హాస్పిటల్‌ చేరుకొని మృతురాలి తండ్రి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

Married Woman Dead in Jagtial : జగిత్యాల జిల్లా పోచమ్మవాడలో బుధవారం సాయంత్రం వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ తీవ్రంగా కలచి వేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన గంగాధర్-శోభ దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్న (29)కు రెండు సంవత్సరాల క్రితం వెల్గటూరు మండలం రాంనూర్‌కు చెందిన తిరుపతితో వివాహం జరిగింది.

ఇద్దరూ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తుండగా, ఏడాది కిందట కుమారుడు జన్మించాడు. లక్ష్మీ ప్రసన్న ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుండగా భర్త, అత్తింటి వారు అదనపు కట్నంతో పాటు కుమారుడి పోలికపై అనుమానంతో వేధిస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఒప్పుకున్నారు. రూ.10 లక్షల నగదు చెల్లించారు. మిగతాది భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. 5 రోజుల కిందట బెంగళూరు నుంచి దంపతులిద్దరూ రాంనూర్‌కు చేరుకున్నారు.

అద్దంపై రాసి ఆత్మహత్య : బుధవారం గంగాధర్‌ రాంనూర్‌ వెళ్లి కుమార్తె, మనవడిని తీసుకొని జగిత్యాలకు వచ్చారు. సాయంత్రం ఇంట్లో అద్దంపై ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా కుమారుడు జాగ్రత్త. ప్లీజ్‌ వాళ్లకు మాత్రం ఇవ్వకండి’ అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త తిరుపతి, అత్తమామలు, ముగ్గురు ఆడబిడ్డలపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ డి.రఘుచందర్, పట్టణ సీఐ సూరం వేణు గోపాల్, తహసీల్దార్‌ సి.రాంమోహన్‌ హాస్పిటల్‌ చేరుకొని మృతురాలి తండ్రి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

'నా బూడిదను కాలువలో కలిపేయండి'- భార్య వేధింపులతో భర్త బలవన్మరణం

వరుసగా విడుదల అవుతున్న పరీక్షా ఫలితాలు - మీ పిల్లలపై ఓ కన్నేయండి!

'నాకు వధువు వద్దు- ఆమె చెల్లినే పెళ్లాడుతా!'- వరుడు వింత వాదన- పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.