ETV Bharat / state

పెంపుడు కుక్క వద్దకు వస్తున్నాయని కర్కశత్వం - కుక్క పిల్లలను కొట్టి చంపిన వ్యక్తి - MAN KILLED PUPPIES IN SECUNDERABAD

మూగజీవాలపై కర్కశత్వం చూపించిన వ్యక్తి - తన పెంపుడు శునకం దగ్గరకు వస్తున్నాయని వీధి కుక్క పిల్లలను చంపేసిన వైనం - సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలో ఘటన

DOGS ISSUE IN HYDERABAD
DOGS ISSUE IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 17, 2025 at 8:55 PM IST

1 Min Read

Man Killed Puppies in Secunderabad : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం వీబీ సిటీ కాలనీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆశిష్ అనే వ్యక్తి నోరులేని మూగజీవాలైన కుక్క పిల్లలపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించి హతమార్చాడు.

తన కుక్క వద్దకు వస్తున్నాయనే : ఈ నెల 14 (సోమవారం)న మూడు వీధి కుక్కలపై దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తనతో పాటు పెంచుకుంటున్న పెంపుడు శునకం దగ్గరికు వీధి కుక్క పిల్లలు వస్తుండటంతో ఆగ్రహానికి గురై ఆశీష్ ఓ బిల్డింగ్​లోని సెల్లార్​లో ఇటుకలతో వాటిని కొట్టి హింసించి చంపాడు. దాడిలో తీవ్ర గాయాల పాలైన కుక్కపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు : ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియోల ఆధారంగా ఆశిష్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీధి కుక్కలపై కోపంతో వాటిని చంపినట్లు పోలీసులు ఎదుట నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. మూగజీవాలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Man Killed Puppies in Secunderabad : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం వీబీ సిటీ కాలనీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆశిష్ అనే వ్యక్తి నోరులేని మూగజీవాలైన కుక్క పిల్లలపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించి హతమార్చాడు.

తన కుక్క వద్దకు వస్తున్నాయనే : ఈ నెల 14 (సోమవారం)న మూడు వీధి కుక్కలపై దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తనతో పాటు పెంచుకుంటున్న పెంపుడు శునకం దగ్గరికు వీధి కుక్క పిల్లలు వస్తుండటంతో ఆగ్రహానికి గురై ఆశీష్ ఓ బిల్డింగ్​లోని సెల్లార్​లో ఇటుకలతో వాటిని కొట్టి హింసించి చంపాడు. దాడిలో తీవ్ర గాయాల పాలైన కుక్కపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు : ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియోల ఆధారంగా ఆశిష్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీధి కుక్కలపై కోపంతో వాటిని చంపినట్లు పోలీసులు ఎదుట నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. మూగజీవాలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

మూగజీవాలపై కర్కశం.. కుక్క పిల్లలకు నిప్పంటించి..

Dog And Snake Fight: పిల్లల కోసం పాముతో ఆ తల్లి పోరాటం చివరకు...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.