Laurus Labs Will Established in Rambilli of Anakapalli District : అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు ఈ విషయాన్ని వెల్లడించారు. లారెస్ ల్యాబ్స్ సుమారు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్టు సమాచారం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఫార్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేసేందుకు యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. తమ సంస్థకు రాంబిల్లిలో భూమి కేటాయింపులు చేసినందుకు సీఎంకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని భూకేటాయింపులతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం తమతో చెప్పినట్లు నరసింహారావు తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని సీఎం కోరినట్లు వెల్లడించారు. విశాఖ, బెంగుళూరు, హైదరాబాద్లో యూనిట్లు కలిగిన లారస్ ల్యాబ్స్ విస్తరణలో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పరిశ్రమ యూనిట్ ఏర్పాటు చేయనుంది.
దూసుకెళ్తున్న సౌర విద్యుత్ రంగం - ఐదేళ్లలో కోటి 60 లక్షల ఉద్యోగాలు
‘టెస్లా’ కోసం భూములు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం - ఆ జిల్లాలో 500 ఎకరాలు పరిశీలన