Update in MMTS Medchal Case : ఇటీవల కలకలం రేపిన ఎంఎంటీఎస్ రైల్లో యువతి(23)పై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. రైల్వే పోలీసులను విచారణలో ఆ యువతి తప్పుదోవ పట్టించినట్లు తేల్చారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం మొబైల్ ఫోన్లో ఇన్స్టా రీల్స్ చేస్తుండగా యువతి ప్రమాదవశాత్తు జారిపడినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు.
120 అనుమానితులను : కట్టుకథ చెప్పి తనపై అత్యాచారయత్నం జరిగిందని యువతి అందరిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు 300లకు పైగా సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించిన రైల్వే పోలీసులు యువతిపై అత్యాచారం జరగలేదని ఆమె ద్వారానే తెలుసుకున్నారు. న్యాయ పరమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు జరిగింది ఇది : మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటున్న యువతి తన మొబెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి మార్చి 22న సికింద్రాబాద్కు ఎంఎంటీఎస్ ట్రైన్లో వెళ్లింది. అదే రోజు తిరిగి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు ఎంఎంటీఎస్ మహిళల కోచ్లో బయలుదేరింది. అనంతరం మొబైల్ ఫోన్లో రీల్స్ చేస్తూ జారీ ట్రైన్ నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
విచారణలో తేలిన అసలు నిజం : ఇది గమనించిన కొందరు అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి నిజాన్ని చెప్పకుండా తనపై అత్యాచారయత్నం జరిగిందని పోలీసులను తప్పుదోవ పట్టించింది. విచారణలో భాగంగా పోలీసులు అసలు జరిగిందంతా బాధితురాలితోనే తెలుసుకున్నారు.