ETV Bharat / state

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో షాకింగ్ ట్విస్ట్ - A WOMAN CASE IN MMTS MEDCHAL

యువతిపై అత్యాచారయత్నం అవాస్తవమని తేల్చిన పోలీసులు - రైల్వే పోలీసులను తప్పుదోవ పట్టించిన యువతి - ఎంఎంటీఎస్‌లో రీల్స్ చేస్తూ యువతి జారిపడినట్లు తేల్చిన పోలీసులు

MMTS TRAIN IN MEDCHAL
MMTS TRAIN IN MEDCHAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 4:03 PM IST

Updated : April 18, 2025 at 5:15 PM IST

1 Min Read

Update in MMTS Medchal Case : ఇటీవల కలకలం రేపిన ఎంఎంటీఎస్ రైల్లో యువతి(23)పై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. రైల్వే పోలీసులను విచారణలో ఆ యువతి తప్పుదోవ పట్టించినట్లు తేల్చారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం మొబైల్ ఫోన్​లో ఇన్​స్టా రీల్స్ చేస్తుండగా యువతి ప్రమాదవశాత్తు జారిపడినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు.

120 అనుమానితులను : కట్టుకథ చెప్పి తనపై అత్యాచారయత్నం జరిగిందని యువతి అందరిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు 300లకు పైగా సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించిన రైల్వే పోలీసులు యువతిపై అత్యాచారం జరగలేదని ఆమె ద్వారానే తెలుసుకున్నారు. న్యాయ పరమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు జరిగింది ఇది : మేడ్చల్​లోని ఓ వసతి గృహంలో ఉంటున్న యువతి తన మొబెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి మార్చి 22న సికింద్రాబాద్​కు ఎంఎంటీఎస్​ ట్రైన్​లో వెళ్లింది. అదే రోజు తిరిగి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్​కు ఎంఎంటీఎస్​ మహిళల కోచ్​లో బయలుదేరింది. అనంతరం మొబైల్ ఫోన్​లో రీల్స్​ చేస్తూ జారీ ట్రైన్​ నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

విచారణలో తేలిన అసలు నిజం : ఇది గమనించిన కొందరు అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి నిజాన్ని చెప్పకుండా తనపై అత్యాచారయత్నం జరిగిందని పోలీసులను తప్పుదోవ పట్టించింది. విచారణలో భాగంగా పోలీసులు అసలు జరిగిందంతా బాధితురాలితోనే తెలుసుకున్నారు.

MMTSలో యువతిపై అత్యాచారయత్నం - ట్రైన్​ నుంచి దూకేయడంతో?

MMTSలో యువతిపై అత్యాచారయత్నం - పోలీసుల అదుపులో అనుమానితులు

Update in MMTS Medchal Case : ఇటీవల కలకలం రేపిన ఎంఎంటీఎస్ రైల్లో యువతి(23)పై అత్యాచారయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. రైల్వే పోలీసులను విచారణలో ఆ యువతి తప్పుదోవ పట్టించినట్లు తేల్చారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం మొబైల్ ఫోన్​లో ఇన్​స్టా రీల్స్ చేస్తుండగా యువతి ప్రమాదవశాత్తు జారిపడినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు.

120 అనుమానితులను : కట్టుకథ చెప్పి తనపై అత్యాచారయత్నం జరిగిందని యువతి అందరిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు 300లకు పైగా సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించిన రైల్వే పోలీసులు యువతిపై అత్యాచారం జరగలేదని ఆమె ద్వారానే తెలుసుకున్నారు. న్యాయ పరమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు జరిగింది ఇది : మేడ్చల్​లోని ఓ వసతి గృహంలో ఉంటున్న యువతి తన మొబెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి మార్చి 22న సికింద్రాబాద్​కు ఎంఎంటీఎస్​ ట్రైన్​లో వెళ్లింది. అదే రోజు తిరిగి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్​కు ఎంఎంటీఎస్​ మహిళల కోచ్​లో బయలుదేరింది. అనంతరం మొబైల్ ఫోన్​లో రీల్స్​ చేస్తూ జారీ ట్రైన్​ నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

విచారణలో తేలిన అసలు నిజం : ఇది గమనించిన కొందరు అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి నిజాన్ని చెప్పకుండా తనపై అత్యాచారయత్నం జరిగిందని పోలీసులను తప్పుదోవ పట్టించింది. విచారణలో భాగంగా పోలీసులు అసలు జరిగిందంతా బాధితురాలితోనే తెలుసుకున్నారు.

MMTSలో యువతిపై అత్యాచారయత్నం - ట్రైన్​ నుంచి దూకేయడంతో?

MMTSలో యువతిపై అత్యాచారయత్నం - పోలీసుల అదుపులో అనుమానితులు

Last Updated : April 18, 2025 at 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.