ETV Bharat / state

దాయమ్మ ఈ పని మీకు తగునా? - ఆసుపత్రి మహిళ సిబ్బంది సంచిలో కరెన్సీ నోట్ల కట్టలు, విలువైన మందులు - MEDICINES SEIZED FROM FEMALE STAFF

నిలోఫర్​ ఆసుపత్రి మహిళ సిబ్బంది నుంచి భారీగా మందులు స్వాధీనం

Medicines Seized From Hospital Female Staff
Medicines Seized From Hospital Female Staff (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 25, 2025 at 12:00 AM IST

1 Min Read

Medicines Seized From Hospital Female Staff : ఆమె చారిత్రక నిలోఫర్‌ హాస్పిటల్​లో దాయమ్మగా పని చేసే శాలిని. ప్రస్తుతం లిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం రాత్రి రెండు పెద్ద సంచులతో వచ్చింది. లిఫ్ట్‌లో వెళ్లే క్రమంలో ఆమె ప్రవర్తనను గమనించిన హాస్పిటల్​లో విధుల్లో ఉండే పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అడ్డుకొని ప్రశ్నించగా వారిపైనే చిందులు తొక్కింది.

పోలీసులు మహిళా భద్రతా సిబ్బందిని పిలిపించి సంచులను తెరిపించి చూశారు. ఆరు వేలు, ఏడు వేల రూపాయల ఖరీదు చేసే ఇంజెక్షన్లు, సిరంజీలతో పాటు ఖరీదైన మందులు బయటపడ్డాయి. కాగా మరో సంచిలో కరెన్సీ నోట్లు కనిపించాయి. మందులు ఎక్కడివని ఆమెను ప్రశ్నిస్తే కోఠి నుంచి కొనుక్కొని వచ్చినట్లుగా చెప్పింది. శాలిని వద్ద దొరికిన మందులన్నీ హాస్పిటల్​లోని వేనని వైద్యాధికారులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హాస్పిటల్​కు వచ్చే రోగులకు మందుల్లేవని : రాత్రి వేళలో హాస్పిటల్​కు వచ్చే రోగులకు కొన్నిసార్లు మందుల్లేవని బయటకు పంపిస్తుంటారని రోగుల తాలుకు బంధువులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మందులకు మెడికల్‌ షాప్‌కు వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోతోంది. అలాంటి వారిని టార్గెట్​గా చేసుకొని, రెట్టింపు డబ్బులు తీసుకొని మందులు అమ్ముతున్నట్లుగా కొందరు చెప్పారు.

కాగా బుధవారం డ్యూటీ ఆర్‌ఎంఓ ఒకరు ఈ ఘటనపై నాంపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు స్పష్టంగా లేదని పోలీసులు చెప్పినట్లుగా సమాచారం. ఆమె దగ్గర దొరికిన మెడిసిన్​ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సూపరింటెండెంట్‌ ద్వారా కంప్లైంట్​ను పంపించాలని పోలీసులు సూచించినట్లు తెలిసింది.

Medicines Seized From Hospital Female Staff : ఆమె చారిత్రక నిలోఫర్‌ హాస్పిటల్​లో దాయమ్మగా పని చేసే శాలిని. ప్రస్తుతం లిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం రాత్రి రెండు పెద్ద సంచులతో వచ్చింది. లిఫ్ట్‌లో వెళ్లే క్రమంలో ఆమె ప్రవర్తనను గమనించిన హాస్పిటల్​లో విధుల్లో ఉండే పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అడ్డుకొని ప్రశ్నించగా వారిపైనే చిందులు తొక్కింది.

పోలీసులు మహిళా భద్రతా సిబ్బందిని పిలిపించి సంచులను తెరిపించి చూశారు. ఆరు వేలు, ఏడు వేల రూపాయల ఖరీదు చేసే ఇంజెక్షన్లు, సిరంజీలతో పాటు ఖరీదైన మందులు బయటపడ్డాయి. కాగా మరో సంచిలో కరెన్సీ నోట్లు కనిపించాయి. మందులు ఎక్కడివని ఆమెను ప్రశ్నిస్తే కోఠి నుంచి కొనుక్కొని వచ్చినట్లుగా చెప్పింది. శాలిని వద్ద దొరికిన మందులన్నీ హాస్పిటల్​లోని వేనని వైద్యాధికారులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హాస్పిటల్​కు వచ్చే రోగులకు మందుల్లేవని : రాత్రి వేళలో హాస్పిటల్​కు వచ్చే రోగులకు కొన్నిసార్లు మందుల్లేవని బయటకు పంపిస్తుంటారని రోగుల తాలుకు బంధువులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మందులకు మెడికల్‌ షాప్‌కు వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోతోంది. అలాంటి వారిని టార్గెట్​గా చేసుకొని, రెట్టింపు డబ్బులు తీసుకొని మందులు అమ్ముతున్నట్లుగా కొందరు చెప్పారు.

కాగా బుధవారం డ్యూటీ ఆర్‌ఎంఓ ఒకరు ఈ ఘటనపై నాంపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు స్పష్టంగా లేదని పోలీసులు చెప్పినట్లుగా సమాచారం. ఆమె దగ్గర దొరికిన మెడిసిన్​ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సూపరింటెండెంట్‌ ద్వారా కంప్లైంట్​ను పంపించాలని పోలీసులు సూచించినట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.