ETV Bharat / state

తెలంగాణ జాతిపిత కేసీఆర్ - బూతుపిత రేవంత్‌రెడ్డి: కేటీఆర్‌ - KTR SPEECH IN ASSEMBLY SESSIONS

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్ - అప్పులపై ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శాసన సభలో ఆగ్రహం

KTR Speech In Telangana Assembly Sessions
KTR Speech In Telangana Assembly Sessions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 27, 2025 at 3:06 PM IST

Updated : March 27, 2025 at 5:24 PM IST

3 Min Read

KTR Speech In Telangana Assembly Sessions : ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని, తెలంగాణ బూతుపిత రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ అభివర్ణించారు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి కొనసాగుతూ వస్తోందని అన్నారు. చివరగా 2001లో నాటి ఎన్డీయే ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రెండున్నర దశాబ్దాల్లో ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదని, ఇటీవలే సెక్రటేరియట్‌, అసెంబ్లీలు కట్టుకున్నారని తెలిపారు.

అగ్రగామిగా తెలంగాణ నిలబడింది : ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకెళ్లింది మన తెలంగాణే అని, స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం మనందరికి గర్వకారణమని వెల్లడించారు. గత పదేళ్లలో అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని ఆవిష్కరించి తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్‌ నిలబెట్టారని కొనియాడారు. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో సరికొత్త పంథాను అనుసరించామని, 2014 నుంచి 2022 వరకు వృద్ధి రేటు తీసుకుంటే 17.57 శాతంతో అగ్రగామిగా తెలంగాణ నిలబడిందని వివరించారు.

తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోంది : తెలంగాణకు మేలు జరగాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రం బాగుండాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని, తమకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం మాట్లాడకపోవడం బాధేసిందని అన్నారు.

మేము కూడా మద్దతిస్తాం : పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారని గుర్తు చేశారు. తమకు వచ్చిందే సున్నానే మరి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా అని నిలదీశారు. పసుపు బోర్డు ప్రకటించి ఆ బోర్డుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదని, పోరాడాల్సిందేనని చెప్పారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని అన్నారు.

రేవంత్‌రెడ్డి ఏం సాధించారు : సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ప్రతి పనిలో గత ప్రభుత్వమని తమని విమర్శిస్తున్నవారు కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుందని, సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని, మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. తెలంగాణ1 ట్రిలియల్‌ ఎకానిమీ కావాలంటే ప్రస్తుత ధరల ప్రకరాం 35 ఏళ్లు పడుతుందని, పీఎం రెండు కోట్ల ఉద్యోగాలు, సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తమన్నారని గుర్తు చేశారు. పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రంతో సఖ్యత వల్ల రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు.

అప్పులపై ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరికీ పెద్ద అవగాహన లేదని, 10 ఏళ్ల తర్వాత సకల సౌకర్యాలతో రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పామని అన్నారు.

తెలంగాణపై ఉన్నది సవతితల్లి ప్రేమ మాత్రమే : అద్దెలు చెల్లించకపోవడంతో గురుకుల భవనాలకు తాళాలు వేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంటే మేం కూడా చెల్లించాని అన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది 11 వేల ఉద్యోగాలు మాత్రమేనని, తాము పరీక్షలు నిర్వహించిన వాటికే వీళ్లు నియామకపత్రాలు ఇచ్చారని అన్నారు. గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామన్నారని, ఇప్పటికీ చేయలేదని, కోటి మంది మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారని, ఇవ్వలేదని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారని, దళితబంధు, గిరిజనబంధు కింద రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్నారని ఇవ్వాలని కోరారు. రెండు దిల్లీ పార్టీలకు తెలంగాణపై ఉన్నది సవతితల్లి ప్రేమ మాత్రమేనని తెలిపారు.

"కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదు?. ప్రతి పనిలో గత ప్రభుత్వమని మమ్మల్ని విమర్శిస్తున్నవారు కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా?. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి. కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుంది. సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదు. పోరాడాల్సిందే. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేము కూడా మద్దతిస్తాం."- కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యుడు

కేటీఆర్​ 30శాతం కమీషన్ వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం - ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న డిప్యూటీ సీఎం

KTR Speech In Telangana Assembly Sessions : ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని, తెలంగాణ బూతుపిత రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ అభివర్ణించారు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి కొనసాగుతూ వస్తోందని అన్నారు. చివరగా 2001లో నాటి ఎన్డీయే ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రెండున్నర దశాబ్దాల్లో ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదని, ఇటీవలే సెక్రటేరియట్‌, అసెంబ్లీలు కట్టుకున్నారని తెలిపారు.

అగ్రగామిగా తెలంగాణ నిలబడింది : ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకెళ్లింది మన తెలంగాణే అని, స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం మనందరికి గర్వకారణమని వెల్లడించారు. గత పదేళ్లలో అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని ఆవిష్కరించి తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్‌ నిలబెట్టారని కొనియాడారు. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో సరికొత్త పంథాను అనుసరించామని, 2014 నుంచి 2022 వరకు వృద్ధి రేటు తీసుకుంటే 17.57 శాతంతో అగ్రగామిగా తెలంగాణ నిలబడిందని వివరించారు.

తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోంది : తెలంగాణకు మేలు జరగాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రం బాగుండాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని, తమకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం మాట్లాడకపోవడం బాధేసిందని అన్నారు.

మేము కూడా మద్దతిస్తాం : పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారని గుర్తు చేశారు. తమకు వచ్చిందే సున్నానే మరి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా అని నిలదీశారు. పసుపు బోర్డు ప్రకటించి ఆ బోర్డుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదని, పోరాడాల్సిందేనని చెప్పారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని అన్నారు.

రేవంత్‌రెడ్డి ఏం సాధించారు : సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ప్రతి పనిలో గత ప్రభుత్వమని తమని విమర్శిస్తున్నవారు కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుందని, సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని, మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. తెలంగాణ1 ట్రిలియల్‌ ఎకానిమీ కావాలంటే ప్రస్తుత ధరల ప్రకరాం 35 ఏళ్లు పడుతుందని, పీఎం రెండు కోట్ల ఉద్యోగాలు, సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తమన్నారని గుర్తు చేశారు. పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రంతో సఖ్యత వల్ల రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు.

అప్పులపై ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరికీ పెద్ద అవగాహన లేదని, 10 ఏళ్ల తర్వాత సకల సౌకర్యాలతో రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పామని అన్నారు.

తెలంగాణపై ఉన్నది సవతితల్లి ప్రేమ మాత్రమే : అద్దెలు చెల్లించకపోవడంతో గురుకుల భవనాలకు తాళాలు వేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంటే మేం కూడా చెల్లించాని అన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది 11 వేల ఉద్యోగాలు మాత్రమేనని, తాము పరీక్షలు నిర్వహించిన వాటికే వీళ్లు నియామకపత్రాలు ఇచ్చారని అన్నారు. గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామన్నారని, ఇప్పటికీ చేయలేదని, కోటి మంది మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారని, ఇవ్వలేదని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారని, దళితబంధు, గిరిజనబంధు కింద రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్నారని ఇవ్వాలని కోరారు. రెండు దిల్లీ పార్టీలకు తెలంగాణపై ఉన్నది సవతితల్లి ప్రేమ మాత్రమేనని తెలిపారు.

"కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదు?. ప్రతి పనిలో గత ప్రభుత్వమని మమ్మల్ని విమర్శిస్తున్నవారు కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా?. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి. కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుంది. సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదు. పోరాడాల్సిందే. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేము కూడా మద్దతిస్తాం."- కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యుడు

కేటీఆర్​ 30శాతం కమీషన్ వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం - ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న డిప్యూటీ సీఎం

Last Updated : March 27, 2025 at 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.