ETV Bharat / state

ఆ ఊరోళ్లు చోరీల్లో మొనగాళ్లు - ముఖ్యంగా అవే వారి టార్గెట్ - KPHB POLICE CAUGHT LAPTOPS THIEVES

ల్యాప్​ట్యాప్​ దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు - వీటి వెనుక ముఠా ఉన్నట్లు గుర్తింపు - పోలీసుల అదుపులో నిందితుడు

KPHB Police Caught Laptops Thieves
KPHB Police Caught Laptops Thieves (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 8, 2025 at 9:39 AM IST

1 Min Read

KPHB Police Caught Laptops Thieves : ల్యాప్​టాప్​ల దొంగలు దొరికారంటే చాలు, తమిళనాడు వెల్లూరు జిల్లాలోని ఉదయ్​రాజపాలేనికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తారు. ఆ ఊరుకు చెందిన దొంగలు ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు చోరీ చేయడంలో ఆరితేరిన వారు. ఇందులో కొత్తవారికి చోరీలు చేయడంలో శిక్షణ ఇవ్వడం గమనార్హం.

ఉదయ్​రాజ్​పాలేనికి చెందిన కరుడుగట్టిన దొంగ వడివేల్ (22) కదలికలపై కేపీహెచ్​బీ పోలీసులు నిఘా పెట్టారు. 2022లో కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తుండగా, కానిస్టేబుల్ సురేశ్ పట్టుకున్నారు. మూగవాడిగా నటించి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు. లాకప్ నుంచి పారిపోయాడు. 2023లో సీసీఎస్ మాదాపూర్ పోలీసులకు చిక్కడంతో చోరీల వెనక పెద్ద నెట్​వర్క్ ఉందని దర్యాప్తులో తేలింది. తాజాగా గత నెల 27న కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేసిన గణేశన్ (27) కూడా ఈ ఊరుకు చెందినవాడే. అక్కడే కుమార్ వద్ద శిక్షణ పొందాడు. కుమార్ మరణించిన తర్వాత గణేశన్, తన ఊరుకు చెందిన రాజేందర్​లు ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు.

తెల్లవారుజామునే దొంగతనాలు : తిరుపతికి 20 కిలో మీటర్ల దూరంలో ఉండే ఉదయ్​రాజ్​పాలెం దొంగలు తమిళం, తెలుగు మాట్లాడుతారు. రైళ్లో ముంబయి, హైదరాబాద్, బెంగళూరుకు చేరుకుంటారు. హాస్టల్స్, బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులుండే కాలనీలను సెలక్ట్ చేసుకుంటారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉన్న గదుల్లో దూరి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు చోరీ చేస్తారు. ఒక్కరు రాకపోయినా పోలీసులకు చిక్కి ఉంటారనుకుని మిగతావారు సొంతూళ్లకు వెళ్లిపోతారు. చోరీ సొత్తును కంటైయినర్‌లో ఇతర దేశాలకు చేరుస్తారు.

తలుపులు తెరిచే నిద్రించడం చోరీలకు కారణమవుతోందని కేపీహెచ్​బీ డీఐ రవికుమార్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు పోగొట్టుకుని ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అవి ఎక్కడికి రవాణా అవుతున్నాయో నిఘా పెట్టామన్నారు.

KPHB Police Caught Laptops Thieves : ల్యాప్​టాప్​ల దొంగలు దొరికారంటే చాలు, తమిళనాడు వెల్లూరు జిల్లాలోని ఉదయ్​రాజపాలేనికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తారు. ఆ ఊరుకు చెందిన దొంగలు ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు చోరీ చేయడంలో ఆరితేరిన వారు. ఇందులో కొత్తవారికి చోరీలు చేయడంలో శిక్షణ ఇవ్వడం గమనార్హం.

ఉదయ్​రాజ్​పాలేనికి చెందిన కరుడుగట్టిన దొంగ వడివేల్ (22) కదలికలపై కేపీహెచ్​బీ పోలీసులు నిఘా పెట్టారు. 2022లో కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తుండగా, కానిస్టేబుల్ సురేశ్ పట్టుకున్నారు. మూగవాడిగా నటించి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు. లాకప్ నుంచి పారిపోయాడు. 2023లో సీసీఎస్ మాదాపూర్ పోలీసులకు చిక్కడంతో చోరీల వెనక పెద్ద నెట్​వర్క్ ఉందని దర్యాప్తులో తేలింది. తాజాగా గత నెల 27న కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేసిన గణేశన్ (27) కూడా ఈ ఊరుకు చెందినవాడే. అక్కడే కుమార్ వద్ద శిక్షణ పొందాడు. కుమార్ మరణించిన తర్వాత గణేశన్, తన ఊరుకు చెందిన రాజేందర్​లు ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు.

తెల్లవారుజామునే దొంగతనాలు : తిరుపతికి 20 కిలో మీటర్ల దూరంలో ఉండే ఉదయ్​రాజ్​పాలెం దొంగలు తమిళం, తెలుగు మాట్లాడుతారు. రైళ్లో ముంబయి, హైదరాబాద్, బెంగళూరుకు చేరుకుంటారు. హాస్టల్స్, బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులుండే కాలనీలను సెలక్ట్ చేసుకుంటారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉన్న గదుల్లో దూరి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు చోరీ చేస్తారు. ఒక్కరు రాకపోయినా పోలీసులకు చిక్కి ఉంటారనుకుని మిగతావారు సొంతూళ్లకు వెళ్లిపోతారు. చోరీ సొత్తును కంటైయినర్‌లో ఇతర దేశాలకు చేరుస్తారు.

తలుపులు తెరిచే నిద్రించడం చోరీలకు కారణమవుతోందని కేపీహెచ్​బీ డీఐ రవికుమార్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు పోగొట్టుకుని ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అవి ఎక్కడికి రవాణా అవుతున్నాయో నిఘా పెట్టామన్నారు.

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం - 'దొంగ తెలివి'తో పోలీసులకే సవాల్

సిబ్బంది పాయింట్​ బ్లాంక్​లో గన్­ - పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు - రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ!

ATMను రాడ్లతో బద్దలు గొట్టి - 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.