KPHB Police Caught Laptops Thieves : ల్యాప్టాప్ల దొంగలు దొరికారంటే చాలు, తమిళనాడు వెల్లూరు జిల్లాలోని ఉదయ్రాజపాలేనికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తారు. ఆ ఊరుకు చెందిన దొంగలు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు చోరీ చేయడంలో ఆరితేరిన వారు. ఇందులో కొత్తవారికి చోరీలు చేయడంలో శిక్షణ ఇవ్వడం గమనార్హం.
ఉదయ్రాజ్పాలేనికి చెందిన కరుడుగట్టిన దొంగ వడివేల్ (22) కదలికలపై కేపీహెచ్బీ పోలీసులు నిఘా పెట్టారు. 2022లో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తుండగా, కానిస్టేబుల్ సురేశ్ పట్టుకున్నారు. మూగవాడిగా నటించి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు. లాకప్ నుంచి పారిపోయాడు. 2023లో సీసీఎస్ మాదాపూర్ పోలీసులకు చిక్కడంతో చోరీల వెనక పెద్ద నెట్వర్క్ ఉందని దర్యాప్తులో తేలింది. తాజాగా గత నెల 27న కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేసిన గణేశన్ (27) కూడా ఈ ఊరుకు చెందినవాడే. అక్కడే కుమార్ వద్ద శిక్షణ పొందాడు. కుమార్ మరణించిన తర్వాత గణేశన్, తన ఊరుకు చెందిన రాజేందర్లు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు.
తెల్లవారుజామునే దొంగతనాలు : తిరుపతికి 20 కిలో మీటర్ల దూరంలో ఉండే ఉదయ్రాజ్పాలెం దొంగలు తమిళం, తెలుగు మాట్లాడుతారు. రైళ్లో ముంబయి, హైదరాబాద్, బెంగళూరుకు చేరుకుంటారు. హాస్టల్స్, బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులుండే కాలనీలను సెలక్ట్ చేసుకుంటారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉన్న గదుల్లో దూరి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు చోరీ చేస్తారు. ఒక్కరు రాకపోయినా పోలీసులకు చిక్కి ఉంటారనుకుని మిగతావారు సొంతూళ్లకు వెళ్లిపోతారు. చోరీ సొత్తును కంటైయినర్లో ఇతర దేశాలకు చేరుస్తారు.
తలుపులు తెరిచే నిద్రించడం చోరీలకు కారణమవుతోందని కేపీహెచ్బీ డీఐ రవికుమార్ తెలిపారు. ల్యాప్టాప్లు పోగొట్టుకుని ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అవి ఎక్కడికి రవాణా అవుతున్నాయో నిఘా పెట్టామన్నారు.
దమ్ముంటే పట్టుకోండి చూద్దాం - 'దొంగ తెలివి'తో పోలీసులకే సవాల్
సిబ్బంది పాయింట్ బ్లాంక్లో గన్ - పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు - రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ!
ATMను రాడ్లతో బద్దలు గొట్టి - 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ