ETV Bharat / state

కిమ్స్​ వైద్యుల అద్భుతం - గంటల్లోనే వణుకుడు రోగం మటుమాయం - KIMS HOSPITAL IN HYDERABAD

వణుకుడు వ్యాధిని నయం చేసి అద్భుతం సృష్టించిన కిమ్స్‌ వైద్యులు - పార్కిన్స‌న్స్‌ జబ్బుకు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం లేని అత్యాధునిక చికిత్స‌ - రోగుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో కిమ్స్ వైద్యులు

KIMS HOSPITAL
KIMS HOSPITAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 17, 2025 at 8:06 PM IST

3 Min Read

KIMS Hospital in Hyderabad : చేతులు, కాళ్లు విప‌రీతంగా వ‌ణికిపోతూ, మ‌న‌ మీద మ‌న‌కే నియంత్ర‌ణ లేకుండా చేసే దారుణ‌మైన స‌మ‌స్య‌ పార్కిన్స‌న్స్ డిసీజ్‌. దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ అనే ఒక శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ఉండేది. కానీ వైద్య ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో ఇప్పుడు ఓ స‌రికొత్త చికిత్స వ‌చ్చింది. అదే ఎంఆర్ గైడెడ్ ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్). దీని సాయంతో కేవ‌లం మూడు నుంచి నాలుగు గంట‌ల్లోనే వ‌ణుకుడు స‌మ‌స్య పూర్తిగా మ‌టుమాయం అయిపోతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్య ప్ర‌ముఖులు చెబుతున్నారు.

పార్కిన్స‌న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ స‌మ‌స్య దాని ల‌క్ష‌ణాలు, ఉన్న చికిత్స అవ‌కాశాల గురించి ఒక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కిమ్స్ హాస్పిటల్స్​లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ గురువారం నిర్వ‌హించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌మ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.

మనిషిని కుంగదీసే సమస్య : ఈ కార్య‌క్ర‌మంలో న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి, చీఫ్ న్యూరోస‌ర్జ‌న్‌ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ, పార్కిన్స‌న్స్ డిసీజ్ అనేది మ‌నిషిని పూర్తిగా కుంగ‌దీసే స‌మ‌స్య‌ని, దీనివ‌ల్ల వ‌చ్చే శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు అవి ఉన్నాయ‌న్న బాధ వ‌ల్ల వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. ఇంత‌కాలం మందులు, డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌లు మాత్ర‌మే దీనికి ప‌రిష్కారంగా ఉండేవని, ఇప్పుడు చిన్న కోత కూడా అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఎంఆర్ఐ యంత్రానికి మ‌రో ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమ‌ర్చి మూడు నాలుగు గంట‌ల పాటు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

8 మంది రోగులకు : ఇది పూర్త‌య్యి రోగి బ‌య‌ట‌కు రాగానే ఒక‌వైపు ఉన్న స‌మ‌స్య పూర్తిగా న‌యం అయిపోతుందని, అప్ప‌టివ‌ర‌కు ఉన్న వ‌ణుకు మ‌టుమాయం అవుతుందని మానస్ కుమార్ పాణిగ్రాహి అన్నారు. పైగా, ఈ ప్ర‌క్రియ చేసేట‌ప్పుడే వ‌ణుకు త‌గ్గిందా? లేదా అని చూసుకుంటూ ఉంటామని, పూర్తిగా తగ్గిన త‌ర్వాతే చికిత్స పూర్త‌వుతుందని తెలిపారు. వ‌ణుకు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న‌వారి నుంచి బాగా తీవ్రంగా ఉన్న‌వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఈ చికిత్స చేయించుకోవ‌చ్చని తెలిపారు. ఇప్ప‌టికే కిమ్స్ ఆస్ప‌త్రిలో 8 మంది రోగుల‌కు దీని సాయంతో చికిత్స చేసి స‌త్ప‌ఫ‌లితాలు సాధించినట్లు తెలిపారు.

పార్కిన్స‌న్స్ వ్యాధి వ‌ల్ల మెద‌డులో ప్ర‌భావిత‌మైన ప్రాంతాల‌ను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్​తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్​ను చేసి వణుకు తగ్గిందా లేదా అని చూసిన త‌ర్వాత ఎక్కువ హీట్​తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుందన్నారు. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుందని, సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ రోగుల‌కు ఒక‌వైపే (కుడి లేదా ఎడ‌మ‌) స‌మ‌స్య తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్ర‌యోజ‌నం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్స‌కు సుమారు 3 నుంచి 4 గంటల స‌మ‌యం ప‌డుతుందని తెలిపారు.

"ఓ కేసులో 28 ఏళ్ల యువ‌కుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచ‌ర్ అవుదామ‌నుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన త‌ర్వాత ఇప్పుడు హాయిగా టీచ‌ర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. చాలామందికి సాయ‌ప‌డుతున్నాడు. అలాంటి నాణ్య‌మైన జీవితాన్ని అంద‌రికీ ఇవ్వాల‌ని కిమ్స్ త‌హ‌త‌హ‌లాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాల‌జీ బృందం అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తోంది. అందుకు వారికి అభినంద‌న‌ల" -డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ

KIMS Hospital in Hyderabad : చేతులు, కాళ్లు విప‌రీతంగా వ‌ణికిపోతూ, మ‌న‌ మీద మ‌న‌కే నియంత్ర‌ణ లేకుండా చేసే దారుణ‌మైన స‌మ‌స్య‌ పార్కిన్స‌న్స్ డిసీజ్‌. దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ అనే ఒక శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ఉండేది. కానీ వైద్య ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో ఇప్పుడు ఓ స‌రికొత్త చికిత్స వ‌చ్చింది. అదే ఎంఆర్ గైడెడ్ ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్). దీని సాయంతో కేవ‌లం మూడు నుంచి నాలుగు గంట‌ల్లోనే వ‌ణుకుడు స‌మ‌స్య పూర్తిగా మ‌టుమాయం అయిపోతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్య ప్ర‌ముఖులు చెబుతున్నారు.

పార్కిన్స‌న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ స‌మ‌స్య దాని ల‌క్ష‌ణాలు, ఉన్న చికిత్స అవ‌కాశాల గురించి ఒక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కిమ్స్ హాస్పిటల్స్​లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ గురువారం నిర్వ‌హించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌మ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.

మనిషిని కుంగదీసే సమస్య : ఈ కార్య‌క్ర‌మంలో న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి, చీఫ్ న్యూరోస‌ర్జ‌న్‌ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ, పార్కిన్స‌న్స్ డిసీజ్ అనేది మ‌నిషిని పూర్తిగా కుంగ‌దీసే స‌మ‌స్య‌ని, దీనివ‌ల్ల వ‌చ్చే శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు అవి ఉన్నాయ‌న్న బాధ వ‌ల్ల వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. ఇంత‌కాలం మందులు, డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌లు మాత్ర‌మే దీనికి ప‌రిష్కారంగా ఉండేవని, ఇప్పుడు చిన్న కోత కూడా అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఎంఆర్ఐ యంత్రానికి మ‌రో ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమ‌ర్చి మూడు నాలుగు గంట‌ల పాటు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

8 మంది రోగులకు : ఇది పూర్త‌య్యి రోగి బ‌య‌ట‌కు రాగానే ఒక‌వైపు ఉన్న స‌మ‌స్య పూర్తిగా న‌యం అయిపోతుందని, అప్ప‌టివ‌ర‌కు ఉన్న వ‌ణుకు మ‌టుమాయం అవుతుందని మానస్ కుమార్ పాణిగ్రాహి అన్నారు. పైగా, ఈ ప్ర‌క్రియ చేసేట‌ప్పుడే వ‌ణుకు త‌గ్గిందా? లేదా అని చూసుకుంటూ ఉంటామని, పూర్తిగా తగ్గిన త‌ర్వాతే చికిత్స పూర్త‌వుతుందని తెలిపారు. వ‌ణుకు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న‌వారి నుంచి బాగా తీవ్రంగా ఉన్న‌వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఈ చికిత్స చేయించుకోవ‌చ్చని తెలిపారు. ఇప్ప‌టికే కిమ్స్ ఆస్ప‌త్రిలో 8 మంది రోగుల‌కు దీని సాయంతో చికిత్స చేసి స‌త్ప‌ఫ‌లితాలు సాధించినట్లు తెలిపారు.

పార్కిన్స‌న్స్ వ్యాధి వ‌ల్ల మెద‌డులో ప్ర‌భావిత‌మైన ప్రాంతాల‌ను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్​తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్​ను చేసి వణుకు తగ్గిందా లేదా అని చూసిన త‌ర్వాత ఎక్కువ హీట్​తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుందన్నారు. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుందని, సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ రోగుల‌కు ఒక‌వైపే (కుడి లేదా ఎడ‌మ‌) స‌మ‌స్య తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్ర‌యోజ‌నం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్స‌కు సుమారు 3 నుంచి 4 గంటల స‌మ‌యం ప‌డుతుందని తెలిపారు.

"ఓ కేసులో 28 ఏళ్ల యువ‌కుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచ‌ర్ అవుదామ‌నుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన త‌ర్వాత ఇప్పుడు హాయిగా టీచ‌ర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. చాలామందికి సాయ‌ప‌డుతున్నాడు. అలాంటి నాణ్య‌మైన జీవితాన్ని అంద‌రికీ ఇవ్వాల‌ని కిమ్స్ త‌హ‌త‌హ‌లాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాల‌జీ బృందం అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తోంది. అందుకు వారికి అభినంద‌న‌ల" -డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.