ETV Bharat / state

కారు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి - కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన ఐఫోన్ - 2 PERSONS KILLED IN CAR ACCIDENT

ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం - కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు - ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు ఐటీ స్నేహితులు

two friends die in road accident
two friends die in road accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 21, 2025 at 10:02 AM IST

2 Min Read

Two Friends Killed in ORR Car Accident : వేరే రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్​లో ఇద్దరు చిరకాల స్నేహితులు ఐటీ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకే అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటూ ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఐఫోన్​ కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జైపూర్​కు చెందిన భాను ప్రకాశ్ ​(36), అదే రాష్ట్రం రావుర్కెలాకు చెందిన నళినికంఠ బిశ్వాల్​(37)లు కాలేజ్​లో చదువుకుంటున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వివాహితులైన ఇద్దరూ రాజేంద్రనగర్​ మంచిరేవులలోని యునైటెడ్​ అమిగో అవెన్యూ అపార్ట్​మెంట్​లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఒకే అపార్టుమెంట్​లో ఉన్న వేర్వేరు ఫ్లాట్లలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు.

శనివారం రాత్రి 8 గంటలకు స్నేహితులిద్దరూ కారులో అపార్ట్​మెంట్​ నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్​ నుంచి పటాన్​చెరు మీదుగా ఓఆర్​ఆర్​పై ఇళ్లకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న కారు మార్గంమధ్యలో మల్లంపేట 4ఏ ఎగ్జిట్ వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. మొదట పల్టీలు కొట్టిన కారు విద్యుత్​ స్తంభానికి తగిలి పక్కరోడ్డుపై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

గంటసేపు శ్రమిస్తే మృతదేహాలు బయటకు : అవుటర్​ సిబ్బంది గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గంటసేపు శ్రమించాల్సి వచ్చింది. కారును భాను ప్రకాశ్​ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమాచారం కుటుంబ సభ్యులకు చేరవేసిన ఐఫోన్​ : కారు ప్రమాదం జరగ్గానే సమాచారం నళినికంఠ బిశ్వాల్​ ఐఫోన్​ ద్వారా అతని భార్య సునైనా మొబైల్​కు వెళ్లింది. సమాచారం, లొకేషన్​ వివరాలు వెళ్లాయి. ఆమె భయాందోళనలకు గురై అదే అపార్ట్​మెంట్​లో ఉంటున్న భానుప్రకాశ్​ భార్య సాయిలక్ష్మికి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు కారులో అక్కడికి సుమారు 1.30 గంటల పాటు ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్​ వాడుతున్న వ్యక్తి ఉంటే అత్యవసర నంబర్లకు సమాచారాన్ని చేరవేస్తుంది. కాగా భానుప్రకాశ్​, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది.

ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ - ముగ్గురు మైనర్లు మృతి

లారీ బోల్తాపడి ఐదుగురు వలస కూలీల దుర్మరణం - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్

Two Friends Killed in ORR Car Accident : వేరే రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్​లో ఇద్దరు చిరకాల స్నేహితులు ఐటీ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకే అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటూ ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఐఫోన్​ కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జైపూర్​కు చెందిన భాను ప్రకాశ్ ​(36), అదే రాష్ట్రం రావుర్కెలాకు చెందిన నళినికంఠ బిశ్వాల్​(37)లు కాలేజ్​లో చదువుకుంటున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వివాహితులైన ఇద్దరూ రాజేంద్రనగర్​ మంచిరేవులలోని యునైటెడ్​ అమిగో అవెన్యూ అపార్ట్​మెంట్​లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఒకే అపార్టుమెంట్​లో ఉన్న వేర్వేరు ఫ్లాట్లలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు.

శనివారం రాత్రి 8 గంటలకు స్నేహితులిద్దరూ కారులో అపార్ట్​మెంట్​ నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్​ నుంచి పటాన్​చెరు మీదుగా ఓఆర్​ఆర్​పై ఇళ్లకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న కారు మార్గంమధ్యలో మల్లంపేట 4ఏ ఎగ్జిట్ వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. మొదట పల్టీలు కొట్టిన కారు విద్యుత్​ స్తంభానికి తగిలి పక్కరోడ్డుపై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

గంటసేపు శ్రమిస్తే మృతదేహాలు బయటకు : అవుటర్​ సిబ్బంది గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గంటసేపు శ్రమించాల్సి వచ్చింది. కారును భాను ప్రకాశ్​ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమాచారం కుటుంబ సభ్యులకు చేరవేసిన ఐఫోన్​ : కారు ప్రమాదం జరగ్గానే సమాచారం నళినికంఠ బిశ్వాల్​ ఐఫోన్​ ద్వారా అతని భార్య సునైనా మొబైల్​కు వెళ్లింది. సమాచారం, లొకేషన్​ వివరాలు వెళ్లాయి. ఆమె భయాందోళనలకు గురై అదే అపార్ట్​మెంట్​లో ఉంటున్న భానుప్రకాశ్​ భార్య సాయిలక్ష్మికి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు కారులో అక్కడికి సుమారు 1.30 గంటల పాటు ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్​ వాడుతున్న వ్యక్తి ఉంటే అత్యవసర నంబర్లకు సమాచారాన్ని చేరవేస్తుంది. కాగా భానుప్రకాశ్​, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది.

ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ - ముగ్గురు మైనర్లు మృతి

లారీ బోల్తాపడి ఐదుగురు వలస కూలీల దుర్మరణం - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.