ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి అరుదైన శస్త్రచికిత్స - చిన్నపేగు మార్పిడి విజయవంతం - OSMANIA HOSPITAL IN HYDERABAD

ఉస్మానియాలో క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం - మృతి చెందిన వ్యక్తి నుంచి సేకరించి బాధితుడికి అమర్చిన వైద్యులు - దేశంలో ఇప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్లు 6 మాత్రమే

Intestine Transplantation Surgery
స్మాల్‌ ఇంటెస్టైన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన ఉస్మానియా వైద్యుల బృందం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 28, 2025 at 10:44 AM IST

Updated : April 28, 2025 at 10:57 AM IST

2 Min Read

Intestine Transplantation Surgery in Osmania Hospital : అత్యంత క్లిష్టమైన, అరుదైన సర్జరీని ఉస్మానియా గవర్నమెంట్ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో 40 ఏళ్ల రోగికి ప్రాణం పోశారు. దిల్లీ ఎయిమ్స్‌తో సహా మరే ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటివరకు సాధ్యం కాని చిన్నపేగు మార్పిడి ప్రక్రియను మన ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు చేసి చూపారు. ప్రభుత్వ దవాఖానాలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవని ఈ సర్జరీతో చాటి చెప్పారు.

చిన్న పేగు తొలగింపు : ఓ 40 ఏళ్ల వ్యక్తికి చిన్న పేగు పూర్తిగా పాడవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు దానిని తొలగించారు. దీంతో బాధితుడు ఏమీ తినలేక, తాగలేక రోజురోజుకు బరువు తగ్గడంతోపాటు, శరీరం పోషకాలను గ్రహించక, డీహైడ్రేషన్‌కు గురవ్వడంతో ఆరోగ్యం విషమించింది. కేవలం ఐవీ ప్లూయిడ్లతో బాధితుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న పేగు మార్పిడి(ఇంటెస్టైన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేస్తే రోగి బతికే పరిస్థితి ఉందని భావించిన బాధితుడి కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు.

12 గంటల పాటు సర్జరీ : దిల్లీలోని ఎయిమ్స్‌లో ఫలితం లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ను సంప్రదించారు. ఈ ఇంటెస్టైన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ క్లిష్టతరమైనా వైద్య బృందం ముందుకొచ్చింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి నుంచి చిన్నపేగును భద్రంగా తొలగించిన ఉస్మానియా వైద్యుల బృందం దాన్ని బాధితుడికి అమర్చింది. ఏప్రిల్ 19(శనివారం)న సుమారు 12 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.

కోలుకుంటున్న బాధితుడు : సర్జరీ తర్వాత ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో పెట్టినా ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు ఉంటుందని వైద్యులు భావించి అత్యంత స్టెరిలైజ్‌ ప్రాంతమైన ఆపరేషన్‌ థియేటర్లోనే రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా బాధితుడు ద్రవాహారం తీసుకుంటూ నెమ్మదిగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.

మొదటి సారిగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే : ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు ఆరు కేసుల్లో మాత్రమే చిన్న పేగు మార్పిడి సర్జరీలు జరిగాయని, దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉస్మానియాలోనే ఈ చికిత్సను మొదటిసారి విజయవంతంగా చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది.

మహిళకు రోబోటిక్ సర్జరీ - ప్రపంచంలోనే అతిపెద్ద అడ్రినల్ కణితి తొలగింపు

నక్షత్ర హాస్పిటల్​లో కాలేయానికి సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స

Intestine Transplantation Surgery in Osmania Hospital : అత్యంత క్లిష్టమైన, అరుదైన సర్జరీని ఉస్మానియా గవర్నమెంట్ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో 40 ఏళ్ల రోగికి ప్రాణం పోశారు. దిల్లీ ఎయిమ్స్‌తో సహా మరే ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటివరకు సాధ్యం కాని చిన్నపేగు మార్పిడి ప్రక్రియను మన ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు చేసి చూపారు. ప్రభుత్వ దవాఖానాలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవని ఈ సర్జరీతో చాటి చెప్పారు.

చిన్న పేగు తొలగింపు : ఓ 40 ఏళ్ల వ్యక్తికి చిన్న పేగు పూర్తిగా పాడవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు దానిని తొలగించారు. దీంతో బాధితుడు ఏమీ తినలేక, తాగలేక రోజురోజుకు బరువు తగ్గడంతోపాటు, శరీరం పోషకాలను గ్రహించక, డీహైడ్రేషన్‌కు గురవ్వడంతో ఆరోగ్యం విషమించింది. కేవలం ఐవీ ప్లూయిడ్లతో బాధితుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న పేగు మార్పిడి(ఇంటెస్టైన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేస్తే రోగి బతికే పరిస్థితి ఉందని భావించిన బాధితుడి కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు.

12 గంటల పాటు సర్జరీ : దిల్లీలోని ఎయిమ్స్‌లో ఫలితం లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ను సంప్రదించారు. ఈ ఇంటెస్టైన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ క్లిష్టతరమైనా వైద్య బృందం ముందుకొచ్చింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి నుంచి చిన్నపేగును భద్రంగా తొలగించిన ఉస్మానియా వైద్యుల బృందం దాన్ని బాధితుడికి అమర్చింది. ఏప్రిల్ 19(శనివారం)న సుమారు 12 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.

కోలుకుంటున్న బాధితుడు : సర్జరీ తర్వాత ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో పెట్టినా ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు ఉంటుందని వైద్యులు భావించి అత్యంత స్టెరిలైజ్‌ ప్రాంతమైన ఆపరేషన్‌ థియేటర్లోనే రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా బాధితుడు ద్రవాహారం తీసుకుంటూ నెమ్మదిగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.

మొదటి సారిగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే : ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు ఆరు కేసుల్లో మాత్రమే చిన్న పేగు మార్పిడి సర్జరీలు జరిగాయని, దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉస్మానియాలోనే ఈ చికిత్సను మొదటిసారి విజయవంతంగా చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది.

మహిళకు రోబోటిక్ సర్జరీ - ప్రపంచంలోనే అతిపెద్ద అడ్రినల్ కణితి తొలగింపు

నక్షత్ర హాస్పిటల్​లో కాలేయానికి సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స

Last Updated : April 28, 2025 at 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.