ETV Bharat / state

నల్లమలలో గాండ్రింపులు - ఏటా పెరుగుతోన్న పులులు - TIGERS CENSUS IN NALLAMALA FOREST

నల్లమల వన్యప్రాణుల భూతల స్వర్గం - అభయారణ్యంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

Tigers Census in Nallamala Forest
Tigers Census in Nallamala Forest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 24, 2025 at 9:34 AM IST

Updated : March 24, 2025 at 9:49 AM IST

2 Min Read

Tigers Census in Nallamala Forest : నల్లమల వన్యప్రాణుల భూతల స్వర్గం. వైవిధ్య, వేలాది జాతులతో నిండిన వన్యప్రాణులకు ఆవాసం. ప్రపంచంలోనే అరుదైన జంతు, వృక్ష సంపదకు నిలయం. దేశంలోనే రెండో అతి పెద్ద అభయారణ్యం. పెద్ద పులులకు అనువైన ఆవాస ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్‌) ప్రాంతంలో వ్యాఘ్రాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉన్నాయి.

2024లో ఈ పులుల సంఖ్య 76కు చేరిందని అటవీ శాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడ పులులు కాగా 32 మగవి అని పేర్కొన్నారు. మరో నాలుగింటి జెండర్‌ను గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు వివరించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ తాజాగా విడుదల చేశారు. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2018 నాటికి ఈ రిజర్వ్​లో 47 వ్యాఘ్రాలు ఉండేవి. ఈ ఆరేళ్ల వ్యవధిలో 29 పెరిగి వాటి సంఖ్య 76కు చేరింది. అంటే 61.70 శాతం మేర పెరిగినట్లయింది.

వేల చిత్రాలు విశ్లేషించి :

  • పులుల గణన కోసం ఎన్‌ఎస్‌టీఆర్‌ను మూడు బ్లాకులుగా అధికారులు విభజించారు. వాటిలో అత్యాధునిక 2270 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధానంగా వ్యాఘ్రాల కదలికలు ఉండే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన వేల ఫొటోలను సాఫ్ట్‌వేర్‌ ద్వారా విశ్లేషించారు. వాటి ఆధారంగా పులులను గుర్తించారు. ఈ రిజర్వ్ పరిధిలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 1.73 వ్యాఘ్రాలు ఉన్నాయని తేల్చారు.
  • టీ 120ఎం, టీ 121ఎం, టీ 125ఎం నంబర్లు కలిగిన మూడు మగ పులులు ఆత్మకూరు నుంచి, టీ 130ఎఫ్‌ నంబరు గల ఒక ఆడపులి మార్కాపురం నుంచి తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుకు వలస వెళ్లినట్లు పేర్కొన్నారు.
  • మగ, ఆడ పులుల నిష్పత్తి 1:3-4 ఉండాలి. కానీ ఇక్కడ 1:1.25గా ఉంది.

వ్యాఘ్రాల ఏకాంత సమయం ఎప్పుడు?- భంగం కలిగితే ఏమవుతుంది! - NO ENTRY IN NALLAMALA FOREST

అడవుల్లో జంతువులను ఎలా లెక్కిస్తారో తెలుసా? - 98% మంది కన్ఫ్యూజ్

Tigers Census in Nallamala Forest : నల్లమల వన్యప్రాణుల భూతల స్వర్గం. వైవిధ్య, వేలాది జాతులతో నిండిన వన్యప్రాణులకు ఆవాసం. ప్రపంచంలోనే అరుదైన జంతు, వృక్ష సంపదకు నిలయం. దేశంలోనే రెండో అతి పెద్ద అభయారణ్యం. పెద్ద పులులకు అనువైన ఆవాస ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్‌) ప్రాంతంలో వ్యాఘ్రాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉన్నాయి.

2024లో ఈ పులుల సంఖ్య 76కు చేరిందని అటవీ శాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడ పులులు కాగా 32 మగవి అని పేర్కొన్నారు. మరో నాలుగింటి జెండర్‌ను గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు వివరించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ తాజాగా విడుదల చేశారు. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2018 నాటికి ఈ రిజర్వ్​లో 47 వ్యాఘ్రాలు ఉండేవి. ఈ ఆరేళ్ల వ్యవధిలో 29 పెరిగి వాటి సంఖ్య 76కు చేరింది. అంటే 61.70 శాతం మేర పెరిగినట్లయింది.

వేల చిత్రాలు విశ్లేషించి :

  • పులుల గణన కోసం ఎన్‌ఎస్‌టీఆర్‌ను మూడు బ్లాకులుగా అధికారులు విభజించారు. వాటిలో అత్యాధునిక 2270 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధానంగా వ్యాఘ్రాల కదలికలు ఉండే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన వేల ఫొటోలను సాఫ్ట్‌వేర్‌ ద్వారా విశ్లేషించారు. వాటి ఆధారంగా పులులను గుర్తించారు. ఈ రిజర్వ్ పరిధిలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 1.73 వ్యాఘ్రాలు ఉన్నాయని తేల్చారు.
  • టీ 120ఎం, టీ 121ఎం, టీ 125ఎం నంబర్లు కలిగిన మూడు మగ పులులు ఆత్మకూరు నుంచి, టీ 130ఎఫ్‌ నంబరు గల ఒక ఆడపులి మార్కాపురం నుంచి తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుకు వలస వెళ్లినట్లు పేర్కొన్నారు.
  • మగ, ఆడ పులుల నిష్పత్తి 1:3-4 ఉండాలి. కానీ ఇక్కడ 1:1.25గా ఉంది.

వ్యాఘ్రాల ఏకాంత సమయం ఎప్పుడు?- భంగం కలిగితే ఏమవుతుంది! - NO ENTRY IN NALLAMALA FOREST

అడవుల్లో జంతువులను ఎలా లెక్కిస్తారో తెలుసా? - 98% మంది కన్ఫ్యూజ్

Last Updated : March 24, 2025 at 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.