ETV Bharat / state

ప్రేమ వివాహం - ఆపై కట్నం కోసం భార్యపై విష ప్రయోగం - చివరకు తానూ? - HUSBAND HARASSED WIFE FOR DOWRY

ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు - వివాహం అనంతరం కట్నం కోసం తల్లిదండ్రులతో భార్యను వేధించిన భర్త - ఆపై విషప్రయోగం

Husband Harassed Wife For Dowry
Husband Harassed Wife For Dowry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 26, 2025 at 1:41 PM IST

1 Min Read

Husband Harassed Wife For Dowry In Bhadradri Kothagudem District : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కావాలంటూ శీతల పానీయంలో పురుగుల మందు కలిపి భార్యకు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. దీంతో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

టేకులపల్లి ఎస్సై అలకుంట రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని దాసుతండా పంచాయతీ రేగులతండాకు చెందిన ఇస్లావత్‌ దీపిక (19)కు 6 నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో ప్రేమ పెళ్లి జరిగింది. కొద్దికాలం పాటు వారిద్దరి కాపురం సజావుగా సాగింది. ఇప్పుడు దీపిక 3 నెలల గర్భవతి. 2 నెలలుగా దీపిక మామ, అత్త, ఆడబిడ్డలు కలిసి కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసేవారు.

ఈ క్రమంలోనే ఈ నెల 24న మధ్యాహ్నం భర్త, అత్త మామలు దీపికతో గొడవపడ్డారు. అనంతరం ఆమెపై దాడి చేశారు. అదే రోజు సాయంత్రం దీపిక భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు, ఎలుకల మందు కలిపిన తాగించాడు. ఆపై తానూ తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వారిద్దరినీ ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపిక శుక్రవారం చనిపోయింది. మృతురాలి తండ్రి వత్మాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అలకుంట రాజేందర్‌ చెప్పారు.

Husband Harassed Wife For Dowry In Bhadradri Kothagudem District : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కావాలంటూ శీతల పానీయంలో పురుగుల మందు కలిపి భార్యకు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. దీంతో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

టేకులపల్లి ఎస్సై అలకుంట రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని దాసుతండా పంచాయతీ రేగులతండాకు చెందిన ఇస్లావత్‌ దీపిక (19)కు 6 నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో ప్రేమ పెళ్లి జరిగింది. కొద్దికాలం పాటు వారిద్దరి కాపురం సజావుగా సాగింది. ఇప్పుడు దీపిక 3 నెలల గర్భవతి. 2 నెలలుగా దీపిక మామ, అత్త, ఆడబిడ్డలు కలిసి కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసేవారు.

ఈ క్రమంలోనే ఈ నెల 24న మధ్యాహ్నం భర్త, అత్త మామలు దీపికతో గొడవపడ్డారు. అనంతరం ఆమెపై దాడి చేశారు. అదే రోజు సాయంత్రం దీపిక భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు, ఎలుకల మందు కలిపిన తాగించాడు. ఆపై తానూ తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వారిద్దరినీ ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపిక శుక్రవారం చనిపోయింది. మృతురాలి తండ్రి వత్మాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అలకుంట రాజేందర్‌ చెప్పారు.

పీటల మీద ఆగిన ప్రేమ వివాహం - ఆ కారణంతో పోలీస్‌ స్టేషన్​కు చేరిన పంచాయితీ

'అమ్మానాన్నా - నా కుమారుడిని మీరే పెంచండి' - అద్దంపై సూసైడ్‌ నోట్‌ రాసి వివాహిత బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.