ETV Bharat / state

కరెంట్​ షాక్​ ఇచ్చి - కే-8 ఆడపులిని చంపేసిన స్మగ్లర్లు - HUNTERS KILLED TIGER

విద్యుత్​ షాక్​ ఇచ్చి పులిని మట్టుబెట్టిన స్మగ్లర్లు - 15 మంది అనుమానితులు అటవీశాఖ అదుపులో - చర్మం, గోళ్లు తీసుకొని, కళేబరాన్ని ఒర్రెలో పాటిపెట్టిన స్మగ్లర్లు

Hunters Killed Tiger with Electric Shock
Hunters Killed Tiger with Electric Shock (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2025 at 7:58 AM IST

1 Min Read

Hunters Killed Tiger with Electric Shock : ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తిరుగుతున్న కే-8 ఆడపులి పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ గ్రామ సమీపంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి మృత్యువాతపడింది. ఈ ఘటనలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎఫ్‌ శాంతారాం, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌లు శనివారం తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13న పులి కెమెరాలకు చిక్కిందని, ఆగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు లైన్‌ను తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా స్పందించలేదని పేర్కొన్నారు. అయితే.. సమీప గ్రామాల ప్రజలు తునికాకు సేకరణకు 15న ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లగా కిందపడి ఉన్న పులిని చూసి భయపడి వెనుదిరిగారు. దీంతో స్మగ్లర్లు పులిని దాదాపు 200 మీటర్ల వరకు మోసుకెళ్లి చర్మం, గోళ్లను తీసుకొని.. మిగిలిన కళేబరాన్ని ఒర్రెలో పాతిపెట్టారు. విషయం అటవీ అధికారులకు తెలియడంతో 16న అటవీ ప్రాంతాన్ని గాలించారు. రక్తపు మరకలు, వెంట్రుకల ఆధారంగా పులిని పాతి పెట్టిన స్థలాన్ని శనివారం ఉదయం గుర్తించారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

రెండు నెలల నుంచి బెజ్జూర్‌ మత్తడి వద్దే : కే-8 పులి రెండు నెలల నుంచి బెజ్జూరు అటవీ ప్రాంతంలోని మత్తడి వద్దే సంచరిస్తోంది. ఈ ప్రాంతం ఆగర్‌గూడ పాతచిచ్చాల అటవీ ప్రాంతానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే పులి ఉనికి మత్తడి నీటి ఊటల వద్దే ఉంటుందని అనుకున్న అధికారులు ఆగర్‌గూడ పాత చిచ్చాలపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట ఆగర్‌గూడ అటవీ ప్రాంతానికి వచ్చిన కే-8.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. 2021లో అది మూడు పిల్లలకు (కే-11, 12, 13) జన్మనిచ్చింది.

Hunters Killed Tiger with Electric Shock : ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తిరుగుతున్న కే-8 ఆడపులి పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ గ్రామ సమీపంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి మృత్యువాతపడింది. ఈ ఘటనలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎఫ్‌ శాంతారాం, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌లు శనివారం తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13న పులి కెమెరాలకు చిక్కిందని, ఆగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు లైన్‌ను తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా స్పందించలేదని పేర్కొన్నారు. అయితే.. సమీప గ్రామాల ప్రజలు తునికాకు సేకరణకు 15న ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లగా కిందపడి ఉన్న పులిని చూసి భయపడి వెనుదిరిగారు. దీంతో స్మగ్లర్లు పులిని దాదాపు 200 మీటర్ల వరకు మోసుకెళ్లి చర్మం, గోళ్లను తీసుకొని.. మిగిలిన కళేబరాన్ని ఒర్రెలో పాతిపెట్టారు. విషయం అటవీ అధికారులకు తెలియడంతో 16న అటవీ ప్రాంతాన్ని గాలించారు. రక్తపు మరకలు, వెంట్రుకల ఆధారంగా పులిని పాతి పెట్టిన స్థలాన్ని శనివారం ఉదయం గుర్తించారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

రెండు నెలల నుంచి బెజ్జూర్‌ మత్తడి వద్దే : కే-8 పులి రెండు నెలల నుంచి బెజ్జూరు అటవీ ప్రాంతంలోని మత్తడి వద్దే సంచరిస్తోంది. ఈ ప్రాంతం ఆగర్‌గూడ పాతచిచ్చాల అటవీ ప్రాంతానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే పులి ఉనికి మత్తడి నీటి ఊటల వద్దే ఉంటుందని అనుకున్న అధికారులు ఆగర్‌గూడ పాత చిచ్చాలపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట ఆగర్‌గూడ అటవీ ప్రాంతానికి వచ్చిన కే-8.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. 2021లో అది మూడు పిల్లలకు (కే-11, 12, 13) జన్మనిచ్చింది.

అక్కడ పులి, ఇక్కడ చిరుత - తలలు పట్టుకుంటున్న అటవీశాఖ

పెద్దపులి సంచారం - భయంతో స్కూల్​కు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.