Huge Devotees To Tirumala Tirupati Temple Rush At Alipiri : వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమలకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ అమాంతం పెరిగిపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీని వల్ల ఆలస్యమవుతోంది. వాహనాలు అలిపిరి ముఖద్వారం వరకు బారులు తీరాయి. టీటీడీ అధికారులు వాహనాల రద్దీని తగ్గించేలా చర్యలు చేపట్టారు.
భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి, వివిధ సేవలకు ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు.సమయం దాటితే తమను సేవలకు అనుమతించరంటూ వాపోతున్నారు.తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు.
తిరుమలకు పెరిగిన భక్తులు - అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ
తిరుమలకు పోటెత్తిన భక్తులు - అలిపిరి దగ్గర బారులు తీరిన వాహనాలు