ETV Bharat / state

ఏప్రిల్​ 1 నాటికి మేజర్ అవుతారా? - అయితే వెంటనే ఆ కార్డుకు అప్లై చేసేయండి - HOW TO REGISTER AS A NEW VOTER

కొత్త ఓటరు నమోదుకు మరోసారి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం - ఏప్రిల్​ ఒకటో తేదీనాటికి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు

How To Register As A New Voter
How To Register As A New Voter (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 20, 2025 at 2:40 PM IST

1 Min Read

How To Register As A New Voter : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు ఓటు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. నూతన ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ.

ఏప్రిల్​ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి : నూతనంగా ఓటరు నమోదుకు గతంలో ఎలక్షన్​ కమిషన్ జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే అవకాశం కల్పించేది. కానీ ఇప్పుడు ప్రతి ఏటా 4 సార్లు జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏప్రిల్‌ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదుకు అర్హులు.

ఇలా ఓటు నమోదు చేసుకోండి :

  • 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు voters.eci.gov.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫారం-6 : 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.
  • ఫారం-7 : స్థానికంగా లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ ఫారంని ఉపయోగిస్తారు. వలస వెళ్లిన వారు (మైగ్రేటెడ్​), రెండు చోట్ల పేరున్న వారు, చనిపోయిన వారి పేర్లను తొలగించుకోవచ్చు.
  • ఫారం -8 : ఓటరు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్​ వంటివి సవరించుకోవచ్చు. ఒక పోలింగ్ సెంటర్​ నుంచి మరో కేంద్రానికి ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు.
  • ఆన్​లైన్​లో మాత్రమే కాకుండా ఆఫ్​లైన్​లో కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో స్థానిక బీఎల్​వో, తహసీల్దార్​ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు - తిరస్కరణ ఎందుకు చేస్తారో తెలుసా? - Postal Ballot Counting 2024

18 కిలోమీటర్ల నడిచి ఓటేసిన గిరిజనులు - అయినా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని ఆవేదన - tribal voters voted in Mulugu

How To Register As A New Voter : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు ఓటు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. నూతన ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ.

ఏప్రిల్​ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి : నూతనంగా ఓటరు నమోదుకు గతంలో ఎలక్షన్​ కమిషన్ జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే అవకాశం కల్పించేది. కానీ ఇప్పుడు ప్రతి ఏటా 4 సార్లు జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏప్రిల్‌ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదుకు అర్హులు.

ఇలా ఓటు నమోదు చేసుకోండి :

  • 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు voters.eci.gov.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫారం-6 : 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.
  • ఫారం-7 : స్థానికంగా లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ ఫారంని ఉపయోగిస్తారు. వలస వెళ్లిన వారు (మైగ్రేటెడ్​), రెండు చోట్ల పేరున్న వారు, చనిపోయిన వారి పేర్లను తొలగించుకోవచ్చు.
  • ఫారం -8 : ఓటరు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్​ వంటివి సవరించుకోవచ్చు. ఒక పోలింగ్ సెంటర్​ నుంచి మరో కేంద్రానికి ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు.
  • ఆన్​లైన్​లో మాత్రమే కాకుండా ఆఫ్​లైన్​లో కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో స్థానిక బీఎల్​వో, తహసీల్దార్​ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు - తిరస్కరణ ఎందుకు చేస్తారో తెలుసా? - Postal Ballot Counting 2024

18 కిలోమీటర్ల నడిచి ఓటేసిన గిరిజనులు - అయినా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని ఆవేదన - tribal voters voted in Mulugu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.