IRCTC Aadhar Authentication Process : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ బుకింగ్కు సంబంధించి ఐఆర్సీటీసీ పలు కీలక మార్పులను చేసింది. ఇకపై ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్స్లో టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుంది. తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి జులై 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఐఆర్సీటీసీ కస్టమర్ సపోర్ట్ విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది.
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ విధంగా చేస్తున్నట్లు పేర్కొంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు వారి ఐఆర్సీటీసీ యూజర్ ప్రొఫైల్ను ఆధార్తో అథెంటికేషన్ చేసుకోవాలని సూచించింది. ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ : ఈ సింపుల్ స్టెప్స్ పాటించి మీరు ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు
- ముందుగా www.irctc.co.in లేదా ఐఆర్సీటీసీ రైల్ కనెస్ట్ మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వండి
- అందులో మై అకౌంట్ సెక్షన్ను సందర్శించి అథెంటికేట్ యూజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి
- అథెంటికేట్ యూజర్ అనే ఆప్షన్లో వచ్చే సూచనలు పాటించండి
- మీ ఆధార్కు అనుసంధానం అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.
- ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఇక తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

మీ ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? - టికెట్ల డబ్బులు తిరిగి ఇలా పొందండి
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్ - ఇక చాటింగ్తోనే రైలు టికెట్