How to Apply for Recounting and Reverification of Inter in TG: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. ఇదిలా ఉంటే, తమకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందని స్టూడెంట్స్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అప్లై చేసుకుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇంటర్లో ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. అలాగే ఈ నెల 23 నుంచి 30 వరకు ఆ పరీక్షలతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరి వాటికి ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
రీ-కౌంటింగ్(Recounting) అంటే ఏమిటి: విద్యార్థులు తాము అనుకున్న మార్కుల కంటే తక్కువ వచ్చినట్లు భావిస్తే వారి మార్కులను తిరిగి కౌంట్ చేయమనడానికి అప్లై చేసుకునే ప్రక్రియ. ఇక దీనికి అప్లై చేసుకోవాలనుకునేవారు ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్కు సంబంధించి ఒక్కో పేపర్ రీకౌంటింగ్ కోసం 100 రూపాయల ఫీజు చెల్లించాలి.

ఎలా అప్లై చేసుకోవాలి:
- రీకౌంటింగ్కు అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ కు లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే TGBIE Websiteపై క్లిక్ చేయాలి. లేదంటే డైరెక్ట్గా ఈ లింక్ https://tgbie.cgg.gov.in/home.do ను ఓపెన్ చేయవచ్చు.
- హోమ్ పేజీలో Students Online Services ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అనంతరం Recounting of Marks ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద కనిపించే బాక్స్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Get Data ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- విద్యార్థికి సంబంధించిన పలు వివరాలు, సబ్జెక్ట్ ప్రకారం వచ్చిన మార్కులు డిస్ప్లే అవుతాయి.
- అప్పుడు మొబైల్ నెంబర్ కాలమ్లో ఫోన్ ఎంటర్ చేసి Get OTP ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఏఏ సబ్జెక్ట్ను రీ కౌంటింగ్కు అప్లై చేయాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన బాక్స్లలో టిక్ చేయాలి.
- చివరగా అందుకు సంబంధించిన ఫీజును చెల్లించి, రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.
రీ వెరిఫికేషన్(Reverification): రీవెరిఫికేషన్ అనేది స్టూడెంట్ ఆన్సర్ షీట్ను వేరే ఎగ్జామినర్ ద్వారా తిరిగి మూల్యాంకనం చేసే ప్రక్రియ. ఇక్కడ మరో ఎగ్జామినర్ జవాబు పత్రాన్ని మళ్లీ వెరిఫై చేసి, ఇచ్చిన మార్కులను ధృవీకరిస్తారు. ఈ క్రమంలో మార్కులు తగ్గొచ్చు, పెరగొచ్చు. రీ వెరిఫికేషన్కు అప్లై చేసుకునే వారు ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్కు సంబంధించి ఒక్కో పేపర్ రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి.

ఎలా అప్లై చేయాలంటే:
- రీవెరిఫికేషన్కు అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులు ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ కు లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే TGBIE Websiteపై క్లిక్ చేయాలి. లేదంటే డైరెక్ట్గా ఈ లింక్ https://tgbie.cgg.gov.in/home.do ఓపెన్ చేయవచ్చు.
- హోమ్ పేజీలో Students Online Services ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అనంతరం Reverification of Valued Answer Scripts ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద కనిపించే బాక్స్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Get Data ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- విద్యార్థికి సంబంధించిన పలు వివరాలు, సబ్జెక్ట్ ప్రకారం వచ్చిన మార్కులు డిస్ప్లే అవుతాయి.
- అప్పుడు మొబైల్ నెంబర్ కాలమ్లో మీ పేరెంట్స్ ఫోన్ ఎంటర్ చేసి Get OTP ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఏఏ సబ్జెక్ట్ను రీ కౌంటింగ్కు అప్లై చేయాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన బాక్స్లలో టిక్ చేయాలి.
- చివరగా అందుకు సంబంధించిన ఫీజును చెల్లించి, రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రీకౌంటింగ్కు అప్లై చేసే విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసే విద్యార్థులు రీకౌంటింగ్కు అప్లై చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయడం ద్వారా మార్కుల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది.
మార్కుల మెమో పోగొట్టుకున్నారా? - ఇలా వెంటనే అప్లై చేసుకోండి!
ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?