ETV Bharat / state

విశాఖ ప్రజలకు గుడ్​న్యూస్ - ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీ - GVMC GIVE DISCOUNT ON PROPERTY TAX

విశాఖలో ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులపై 5 శాతం రాయితీ - ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి రాయితీ పొందొచ్చని ప్రకటన

GVMC_Discount_on_Property_Tax
GVMC_Discount_on_Property_Tax (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 8, 2025 at 8:04 PM IST

1 Min Read

GVMC Announces 5 Percent Discount on Property Taxes: విశాఖలో ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులపై 5 శాతం రాయితీ​ ఇస్తున్నట్లు జీవీఎంసీ (Greater Visakhapatnam Municipal Corporation) ప్రకటించింది. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్​తో సంబంధం లేకుండా పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి 5 శాతం రాయితీ పొందొచ్చని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచ్​చార్జీ కమిషనర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు.

ఆస్తి పన్నుల చెల్లింపులకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సెంటర్​తో సహా అన్ని జోనల్ కార్యాలయాల్లోని కేంద్రాలలో ఈ సౌకర్యం ఉందని అన్నారు. అన్​లైన్ లోనూ చెల్లింపులకు వెసులుబాటు ఉందని వివరించారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ కేంద్రాలు పని చేస్తాయని వెల్లడించారు. ఆస్తిపన్ను చెల్లింపు దారులు gvmc.gov.in-property tax - bharat QR code ద్వారా ఆన్​లైన్​ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

ఇంక జీవీఎంసీ సౌకర్యం కేంద్రాల్లో నగదు, డిడి, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని అలానే ఐడీబీఐ సిరిపురం బ్రాంచ్, ఐసీఐసీఐ ద్వారకా నగర్ బ్రాంచ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధురవాడ బ్రాంచ్, యాక్సిస్ బ్యాంక్ రాంనగర్ బ్రాంచ్​లలో నగదు, డీడీ, డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా వార్డు సచివాలయాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

GVMC Announces 5 Percent Discount on Property Taxes: విశాఖలో ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులపై 5 శాతం రాయితీ​ ఇస్తున్నట్లు జీవీఎంసీ (Greater Visakhapatnam Municipal Corporation) ప్రకటించింది. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్​తో సంబంధం లేకుండా పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి 5 శాతం రాయితీ పొందొచ్చని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచ్​చార్జీ కమిషనర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు.

ఆస్తి పన్నుల చెల్లింపులకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సెంటర్​తో సహా అన్ని జోనల్ కార్యాలయాల్లోని కేంద్రాలలో ఈ సౌకర్యం ఉందని అన్నారు. అన్​లైన్ లోనూ చెల్లింపులకు వెసులుబాటు ఉందని వివరించారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ కేంద్రాలు పని చేస్తాయని వెల్లడించారు. ఆస్తిపన్ను చెల్లింపు దారులు gvmc.gov.in-property tax - bharat QR code ద్వారా ఆన్​లైన్​ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

ఇంక జీవీఎంసీ సౌకర్యం కేంద్రాల్లో నగదు, డిడి, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని అలానే ఐడీబీఐ సిరిపురం బ్రాంచ్, ఐసీఐసీఐ ద్వారకా నగర్ బ్రాంచ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధురవాడ బ్రాంచ్, యాక్సిస్ బ్యాంక్ రాంనగర్ బ్రాంచ్​లలో నగదు, డీడీ, డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా వార్డు సచివాలయాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్‌

జీవీఎంసీలో రూ.120 కోట్ల అక్రమాలు - సహకరించిన ఉన్నతాధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.